Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊపిరి పీల్చుకున్న భారత జట్టు ... వారందరికీ నెగెటివ్

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (14:20 IST)
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత్ క్రికెట్టులో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మిగిలిన వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో వారందరికీ నెగెటివ్ అని వచ్చింది. దీంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. 
 
కాగా, గురువారం నాడు వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ కరోనా పాజిటివ్ బారిన పడటంతో అతడితో కాంటాక్ట్ అయిన క్రికెటర్లకు కరోనా భయం పట్టుకుంది. దీంతో టీమ్ మేనేజ్‌మెంట్ కరోనా పరీక్షలు నిర్వహించింది. అయితే వారందరికీ నెగిటివ్‌గా నిర్ధారణ కావడంతో జట్టు యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది.
 
రిషబ్ పంత్‌తో పాటు అతడికి త్రోలు విసిరే దయానంద్ అనే వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ రావడంతో ప్రస్తుతం వీళ్లిద్దరూ ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో సన్నిహితంగా ఉన్న వృద్ధిమాన్ సాహా, యువ క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్, కోచ్ భరత్ అరుణ్‌ను కూడా ఐసోలేషన్‌కు పంపించారు. 
 
మిగిలిన క్రికెటర్లు డుర్హమ్‌లోని శిక్షణ శిబిరానికి తరలివెళ్లారు. గురువారం కోహ్లీ సేనకు ఆర్టీపీసీఆర్ కరోనా టెస్టులు చేయగా అందరికీ నెగిటివ్ వచ్చినట్లు బీసీసీఐ వెల్లడించింది. ప్రస్తుతం పంత్ బాగున్నాడని, మరో 7 రోజులు అతడు ఐసోలేషన్‌లోనే ఉంటాడని జట్టు వర్గాలు తెలిపాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. చివరికి భార్య, స్నేహితుడి చేతిలోనే?

యూఎస్ వీసా దొరకలేదు.. మనస్తాపంతో జగిత్యాలలో 25 ఏళ్ల మహిళ ఆత్మహత్య

బుడమేరు వరద వార్తలను నమ్మొద్దు, వెలగలేరు గేట్లు తెరవలేదు: ఎన్టీఆర్ కలెక్టర్ (video)

సెప్టెంబర్ చివరి వారంలో అమెరికాలో సందర్శించనున్న ప్రధాని మోదీ

Kerala man: భార్య ఉద్యోగం కోసం ఇంటిని వదిలి వెళ్లిపోయింది.. భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments