ఊపిరి పీల్చుకున్న భారత జట్టు ... వారందరికీ నెగెటివ్

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (14:20 IST)
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత్ క్రికెట్టులో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మిగిలిన వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో వారందరికీ నెగెటివ్ అని వచ్చింది. దీంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. 
 
కాగా, గురువారం నాడు వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ కరోనా పాజిటివ్ బారిన పడటంతో అతడితో కాంటాక్ట్ అయిన క్రికెటర్లకు కరోనా భయం పట్టుకుంది. దీంతో టీమ్ మేనేజ్‌మెంట్ కరోనా పరీక్షలు నిర్వహించింది. అయితే వారందరికీ నెగిటివ్‌గా నిర్ధారణ కావడంతో జట్టు యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది.
 
రిషబ్ పంత్‌తో పాటు అతడికి త్రోలు విసిరే దయానంద్ అనే వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ రావడంతో ప్రస్తుతం వీళ్లిద్దరూ ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో సన్నిహితంగా ఉన్న వృద్ధిమాన్ సాహా, యువ క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్, కోచ్ భరత్ అరుణ్‌ను కూడా ఐసోలేషన్‌కు పంపించారు. 
 
మిగిలిన క్రికెటర్లు డుర్హమ్‌లోని శిక్షణ శిబిరానికి తరలివెళ్లారు. గురువారం కోహ్లీ సేనకు ఆర్టీపీసీఆర్ కరోనా టెస్టులు చేయగా అందరికీ నెగిటివ్ వచ్చినట్లు బీసీసీఐ వెల్లడించింది. ప్రస్తుతం పంత్ బాగున్నాడని, మరో 7 రోజులు అతడు ఐసోలేషన్‌లోనే ఉంటాడని జట్టు వర్గాలు తెలిపాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి వయసు రాకున్నా సహజీవనం తప్పుకాదు: హైకోర్టు సంచలన తీర్పు

పిల్లలూ... మీకు ఒక్కొక్కళ్లకి 1000 మంది తాలూకు శక్తి వుండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

బలమైన మిత్రుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని మోడి, కీలక ఒప్పందాలు

అసలే చలి.. నాలుగు రోజుల్లో 5.89 లక్షల బీరు కేసులు కుమ్మేసిన మందుబాబులు

జనం మధ్యకి తోడేలుకుక్కలు వచ్చేసాయా? యూసఫ్‌గూడలో బాలుడిపై వీధి కుక్క దాడి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

తర్వాతి కథనం
Show comments