Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ రద్దు... స్వదేశానికి సాఫారీలు

Webdunia
శనివారం, 14 మార్చి 2020 (08:50 IST)
స్వదేశంలో సౌతాఫ్రికాతో జరగాల్సిన వన్డే సిరీస్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రద్దు చేసింది. భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగాల్సివుంది. ఈ సిరీస్‌లో భాగంగా, తొలి వన్డే ధర్మాశాలలో జరగాల్సివుంది. కానీ, వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దు అయింది. ఈ నేపథ్యంలో లక్నో, కోల్‌కతాలలో జరగాల్సిన రెండు, మూడు వన్డేలను కూడా రద్దు చేసింది. 
 
నిజానికి ఈ రెండు వన్డే మ్యాచ్‌లను ఒకే వేదికలో అంటే లక్నోలో స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించకుండా నిర్వహించాలని భావించారు. కానీ, దేశంలో కరోనా వైరస్ బారినపడుతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పైగా, ఈ వైరస్ బారినపడి ఇద్దరు మృత్యువాతపడ్డారు. దీంతో ఈ రెండు వన్డేలను రద్దు చేస్తున్నట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఫలితంగా సఫారీ క్రికెటర్లు తమ దేశానికి వెళ్లిపోయారు. 
 
కాగా, ఇప్పటికే ఈ నెల 29వ తేదీన ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 వేడుకలను కూడా వచ్చే నెలకు వాయిదా వేశారు. అప్పటికీ దేశంలో కరోనా వైరస్ అదుపులోకి రాకుంటే ఈ టోర్నీ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐతో పాటు.. ఐపీఎల్ నిర్వాహకులు వెల్లడించారు. కాగా, కరోనా దెబ్బకు అనేక క్రిడా పోటీల నిర్వహణను వాయిదావేస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

తర్వాతి కథనం
Show comments