Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ రద్దు... స్వదేశానికి సాఫారీలు

Webdunia
శనివారం, 14 మార్చి 2020 (08:50 IST)
స్వదేశంలో సౌతాఫ్రికాతో జరగాల్సిన వన్డే సిరీస్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రద్దు చేసింది. భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగాల్సివుంది. ఈ సిరీస్‌లో భాగంగా, తొలి వన్డే ధర్మాశాలలో జరగాల్సివుంది. కానీ, వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దు అయింది. ఈ నేపథ్యంలో లక్నో, కోల్‌కతాలలో జరగాల్సిన రెండు, మూడు వన్డేలను కూడా రద్దు చేసింది. 
 
నిజానికి ఈ రెండు వన్డే మ్యాచ్‌లను ఒకే వేదికలో అంటే లక్నోలో స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించకుండా నిర్వహించాలని భావించారు. కానీ, దేశంలో కరోనా వైరస్ బారినపడుతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పైగా, ఈ వైరస్ బారినపడి ఇద్దరు మృత్యువాతపడ్డారు. దీంతో ఈ రెండు వన్డేలను రద్దు చేస్తున్నట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఫలితంగా సఫారీ క్రికెటర్లు తమ దేశానికి వెళ్లిపోయారు. 
 
కాగా, ఇప్పటికే ఈ నెల 29వ తేదీన ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 వేడుకలను కూడా వచ్చే నెలకు వాయిదా వేశారు. అప్పటికీ దేశంలో కరోనా వైరస్ అదుపులోకి రాకుంటే ఈ టోర్నీ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐతో పాటు.. ఐపీఎల్ నిర్వాహకులు వెల్లడించారు. కాగా, కరోనా దెబ్బకు అనేక క్రిడా పోటీల నిర్వహణను వాయిదావేస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

UP: ఆరోగ్యం బాగోలేదు.. శృంగారానికి నో చెప్పిందని గొంతు కోసి చంపేశాడు..

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు: బీఎస్ఎఫ్

Senator: ఈ మగాళ్లు మారరా? మందేసి టేబుల్ మీద చిందేయన్నారు.. ముస్లిం సెనేటర్

విద్యార్థుల వీసాలను నిలిపివేసిన ట్రంప్ సర్కారు!!

ప్రయాణికుల హ్యాపీ... సాగరతీరం నుంచి ఎడారి తీరానికి విమాన సర్వీసులు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi : కాలేజీ లెక్చరర్ గా చిరంజీవి - మెగా 157 తాజా అప్ డేట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

తర్వాతి కథనం
Show comments