భారత్ మ్యాచ్‌లన్నీ యూఏఈకి తరలిపాయె... గత్యంతరం లేక అంగీకరించిన పాక్

ఠాగూర్
శుక్రవారం, 8 నవంబరు 2024 (12:03 IST)
వచ్చే యేడాది పాకిస్థాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. ఈ పోటీల నిర్వహణ హక్కులను దక్కించుకున్న పాకిస్థాన్‌..ఈ మ్యాచ్ నిర్వహణ కోసం తాత్కాలిక షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇందులో వచ్చే యేడాది మార్చి ఒకటో తేదీన భారత్ - పాకిస్థాన్, మార్చి 9న లాహోర్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగాల్సివుంది. అయితే, భారత ప్రభుత్వం నుంచి అనుమతి వస్తేనే భారత్ క్రికెట్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటిస్తుందని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ తేల్చి చెప్పింది. లేకపోతే ఈ టోర్నీకి భారత్ దూరంగా ఉంటుందని వెల్లడించింది. ఒక వేళ ఈ టోర్నీకి భారత్ రాకుంటే తీవ్రంగా నష్టపోతామని భావించిన పాకిస్థాన్.. తన వైఖరిని మార్చుకుంది. 
 
ఈ టోర్నీలో పాకిస్థాన్ పర్యటనకు భారత్ సర్కార్ అనుమతించకపోతే షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసేందుకు పిసీబీ సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. భారత్ ఆడే మ్యాచ్‌లను యూఏఈలోని దుబాయ్ లేదా షార్జాలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పీసీబీ విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లుగా పీటీఐ కథనంలో పేర్కొంది.
 
ఈ క్రమంలో టోర్నీని హైబ్రీడ్ విధానంలో వేరే దేశంలో నిర్వహించాల్సి వస్తే ఇబ్బందులు రాకుండా ఐసీసీ ముందుగానే అప్రమత్తమైంది. భారత జట్టు మ్యాచ్లు వేరే దేశంలో నిర్వహించాల్సిన పరిస్థితులు ఎదురైతే అందుకు అవసరమైన నిధులను టోర్నీ బడ్జెట్లో కేటాయించింది. 
 
గతంలో కూడా 2023 అసియా కప్ పాకిస్థాన్ వేదికగా జరగాల్సి ఉండగా, హైబ్రిడ్ విధానం అనుసరించి భారత్ మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించారు. ఇప్పుడు అదే మాదిరిగా యూఏఈలో మ్యాచ్ నిర్వహణకు పీసీబీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విజయవాడ నడిబొడ్డున మావోయిస్టులు - 31 మంది నక్సలైట్లు అరెస్టు

Bengaluru Scam: రూ.32కోట్ల స్కామ్.. ఆమెకు అంత సంపాదన ఎలా వచ్చింది? నెటిజన్ల ప్రశ్న

తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్న వర్షాలు.. తీవ్రమైన చలి

రూ.5వేలు ఇస్తామని చెప్పి.. జ్యూస్‌లో మద్యం కలిపారు.. ఆపై సామూహిక అత్యాచారం

అంబులెన్స్‌లో మంటలు... వైద్యుడితో సహా నలుగురి సజీవదహనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కాలికి దెబ్బ తగిలితే నిర్మాత చిట్టూరి సెంటిమెంట్ అన్నారు : అల్లరి నరేష్

Nayanthara: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రంలో నయనతార లుక్

అర్జున్, ఐశ్వర్య రాజేష్ ల ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా మఫ్టీ పోలీస్ సిద్ధం

రాజు వెడ్స్ రాంబాయి కి కల్ట్ మూవీ అనే ప్రశంసలు దక్కుతాయి - తేజస్వినీ, అఖిల్ రాజ్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

తర్వాతి కథనం
Show comments