Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 : తటస్థ వేదికలపై భారత్ మ్యాచ్‌లు .. సమ్మతించిన పాక్

ఠాగూర్
సోమవారం, 23 డిశెంబరు 2024 (11:12 IST)
వచ్చే యేడాది పాకిస్థాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీని ఐసీసీ నిర్వహించనుంది. ఈ టోర్నీ కోసం పాకిస్థాన్‌కు వెళ్లరాదని భారత్ నిర్ణయించింది. అదేసమయంలో టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహించనున్నట్టు ఐసీసీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్ ఆడే మ్యాచ్‌లన్నింటినీ తటస్థ వేదికలపై నిర్వహించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అంగీకరించింది. ఇందుకోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను తటస్థ వేదికగా ఎంచుకుంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి తటస్థ వేదికగా యూఏఈని పీసీబీ ఎంచుకుందని బోర్డు అధికార ప్రతినిధి అమీర్ మీర్ ఐఏఎన్ఎస్ కి ఒక ప్రకటనలో తెలిపారు.
 
'తటస్థ వేదిక నిర్ణయం గురించి పీసీబీ అధికారికంగా ఐసీసీకి తెలియజేసింది. భారత్, పాకిస్థాన్ ఆడే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లు యూఏఈలో జరుగుతాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి తటస్థ వేదికపై ఆతిథ్య పాకిస్థాన్ నిర్ణయం తీసుకోవలసి ఉండగా.. ఆదివారం నాడు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) హెడ్ షేక్ అల్ నహ్యాన్, పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ సమావేశం తర్వాత తటస్థ వేదికపై తుది నిర్ణయం తీసుకోవడం జరిగింది' అని అమీర్ మీర్ పేర్కొన్నారు.
 
కాగా, వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు 2027 వరకు జరగబోయే ఐసీసీ ఈవెంట్లలో కూడా భారత్, పాక్ మధ్య జరిగే మ్యాచులన్నీ తటస్థ వేదికలపై జరుగుతాయని ఇటీవల ఐసీసీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 (భారత్ ఆతిథ్యం), ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 (భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యం)తో సహా 2028లో జరిగే ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ (పాకిస్థాన్ ఆతిథ్యం) తటస్థ వేదికలలోనే జరగనున్నాయి. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ను ఫిబ్రవరి-మార్చిలలో ఆడాల్సి ఉంది. త్వరలోనే టోర్నమెంట్ షెడ్యూల్ను ప్రకటిస్తామని ఐసీసీ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక నేరస్థుడు - దొంగ అంటే మొహం పగలగొడతా : విజయ్ మాల్యా

నిమిషంలో వెళ్లే దూరానికి ఓలా బైక్ బుక్ చేసిన యువతి, కారణం తెలిస్తే షాకవుతారు (Video)

Mudragada: క్యాన్సర్‌తో పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం.. కుమార్తె వార్నింగ్.. ఎవరికి?

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

తర్వాతి కథనం
Show comments