Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండో-పాక్ క్రికెట్ సంబంధాల్లో ఐసీసీ తలదూర్చదు: డేవ్ రిచర్డ్ సన్

ముంబై పేలుళ్ల అనంతరం భారత్-పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ సిరీస్ జరగని విషయం తెలిసిందే. ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలకు చెందిన మ్యాచ్‌లను అంతర్జాతీయ వేదికలపైనే ఆడిన దాయాది జట్లు స్వదేశాల్లో క్రికెట్ సిరీ

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (14:27 IST)
ముంబై పేలుళ్ల అనంతరం భారత్-పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ సిరీస్ జరగని విషయం తెలిసిందే. ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలకు చెందిన మ్యాచ్‌లను అంతర్జాతీయ వేదికలపైనే ఆడిన దాయాది జట్లు స్వదేశాల్లో క్రికెట్ సిరీస్ ఆడలేదు. ఈ నేపథ్యంలో భారత్‌ను పాకిస్థాన్‌లో పర్యటించేలా చేయాలని.. ఇరు దేశాల మధ్య క్రికెట్ సిరీస్ జరగాలని డిమాండ్ పెరిగిపోతుంది. 
 
అయితే పాక్‌తో ఆడేందుకు భారత్ సుముఖత చూపలేదు. అయినా ఐసీసీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని.. భారత్‌పై ఒత్తిడి తేవాలనే కొందరు చేస్తున్న డిమాండ్‌పై ఐసీసీ స్పందించింది. ఇండో-పాకిస్థాన్ క్రికెట్ సంబంధాల విషయంలో ఐసీసీ తలదూర్చదని, తటస్థంగానే వుంటుందని ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్ సన్ స్పష్టం చేశారు. పాకిస్థాన్ కంటే భారత్ క్రికెట్ వైపే ఐసీసీ ఆసక్తి చూపుతుందనే ఆరోపణలను ఆయన ఖండించారు.
 
తాము అన్ని దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉండాలనే కోరుకుంటున్నామని.. ప్రస్తుతానికైతే భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులున్నాయని.. ఇరుదేశాల సంబంధాలపైనే క్రికెట్ ఆధారపడి వుంటుందన్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు, భద్రత కారణంగా ద్వైపాక్షిక సిరీస్‌పై తాము ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయబోమని రిచర్డ్ సన్ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

IndiGo: 227 ప్రయాణీకుల ప్రాణాలతో పాక్ చెలగాటం (video)

పెళ్లాం తన మాట వినడం లేదని పెళ్లి కుదిర్చిన వ్యక్తిని పొడిచి హత్య చేసిన భర్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

తర్వాతి కథనం
Show comments