Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేకింగ్ న్యూస్... మిథాలీరాజ్ వరల్డ్ రికార్డ్...(Details)

భారత మహిళా క్రికెటర్ మిథాలీరాజ్ ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఒన్డే ఇంటర్నేషనల్ మ్యాచుల్లో ఇప్పటివరకూ చార్లెట్ ఎడ్వర్డ్స్ పేరున నమోదైన 5992 పరుగులు రికార్డున చెరపేసి 5993 పరుగులతో రికార్డు సృష్టించింది. ఎడ్వర్డ్స్ ఈ పరుగులు రికార్డున 191 మ్యాచుల్లో

Webdunia
బుధవారం, 12 జులై 2017 (17:20 IST)
భారత మహిళా క్రికెటర్ మిథాలీరాజ్ ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఒన్డే ఇంటర్నేషనల్ మ్యాచుల్లో ఇప్పటివరకూ చార్లెట్ ఎడ్వర్డ్స్ పేరున నమోదైన 5992 పరుగులు రికార్డున చెరపేసి 5993 పరుగులతో రికార్డు సృష్టించింది. ఎడ్వర్డ్స్ ఈ పరుగులు రికార్డున 191 మ్యాచుల్లో ఆడి సాధించగా మిథాలీ 183 మ్యాచులతోనే సాధించేసింది.
 
మైదానంలో ప్రశాంతంగా కదులుతూ ఆటను ప్రత్యర్థి జట్టునుంచి లాగిపడేయడంలో మిస్టర్ కూల్ ధోనీని మించిన ప్లేయర్ ఆమె. ఒక రకంగా చెప్పాలంటే టీమిండియా పురుషుల జట్టులో ఏ ఒక్కరికీ లేనంత సీనియారిటీ ఆమెకుంది. సీనియర్ ఆటగాడు ధోనీ సైతం 13 ఏళ్ల నుంచే భారత్‌ తరపున ఆడుతుండగా 19 ఏళ్లుగా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మోస్ట్ సీనియర్ క్రికెటర్ మిథాలి.
 
భారత మహిళల క్రికెట్‌ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ అరుదైన ఘనతను సాధించేసింది. అంతేగాకుండా 6 వేల పరుగుల మైలు రాయి దాటిన తొలి మహిళా క్రికెటర్‌గా గుర్తింపు పొందింది. మిథాలీ చాంపియన్స్‌ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తోంది. మిథాలీకి రికార్డులు కొత్తేమి కాదు. ఆమె ఆడిన తొలి వన్డే మ్యాచ్‌లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించింది. 1999లో ఐర్లాండ్‌పై మొదలైన ఆమె ప్రస్థానం ఇప్పటివరకు కొనసాగుతుంది. ఇంత కాలం క్రికెట్‌ ఆడుతున్న మహిళా క్రికెటర్‌గా కూడా ఆమె గుర్తింపు పొందింది. ఇక టెస్టుల్లో డబుల్ సెంచరీ, మహిళా టెస్టుల్లో 10 టెస్టులు ఆడటం ఆమె అదనపు రికార్డు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments