Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీసీఐ కొత్త చీఫ్‌గా శశాంక్ మనోహర్: అక్టోబర్ 4న ఎన్నిక!

Webdunia
మంగళవారం, 29 సెప్టెంబరు 2015 (14:16 IST)
బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా మరణించడంతో 15 రోజుల్లో బీసీసీఐ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా ముందుగా అనురాగ్ ఠాకూర్ పేరు వినిపించినప్పటికీ.. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేసిన శశాంక్ పేరు తెరపైకి వచ్చింది.
 
నాగపూర్ న్యాయవాది అయిన శశాంక్ మనోహర్.. విదర్భ క్రికెట్ అసోసియేషన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ మేరకు అక్టోబర్ 4న ముంబైలో జరిగే బీసీసీఐ ప్రత్యేక జనరల్ మీటింగ్‌లో బీసీసీఐ కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసి, అదే రోజున ప్రకటన చేస్తారు.
 
ఈ విషయమై బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ... బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ బీసీసీఐ కొత్త అధ్యక్ష ఎన్నికల్లో పాలుపంచుకోవట్లేదన్నారు. నామినేషన్లను అక్టోబర్ 3వ తేదీలోపు దాఖలు చేయాల్సి వుంటుందన్నారు. కాగా.. బెంగాల్ దాదా సౌరవ్ గంగూలీ శశాంక్ మనోహన్ పేరును బీసీసీఐ కొత్త అధినేతగా సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments