Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీసీఐ కీలక నిర్ణయం.. ప్రేక్షక్షులు లేకుండా మ్యాచ్‌లు.. ఆ టోర్నీలు రద్దు?

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (10:35 IST)
దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగనున్న వినూ మాన్కడ్‌ ట్రోపీ సహా అన్ని విభాగాల క్రికెట్‌ టోర్నమెంట్లను రద్దు చేస్తున్నట్టు తెలిపింది.

ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా అన్ని రాష్ట్రాల బోర్డులకు సమాచారం అందించారు. కరోనా ఉదృతంగా ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది.
 
అలాగే టీమిండియా, ఇంగ్లండ్‌ మధ్య 5 టీ20ల సిరీస్‌ అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. మొదటి రెండు టీ20లకు 50 శాతం ప్రేక్షకులను అనుమతించిన బీసీసీఐ.. కరోనా కారణంగా మిగతా మూడూ టీ20లతో పాటు రానున్న వన్డే సిరీస్‌ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనుంది.

ఇప్పటికే మంగళవారం జరిగిన మూడో టీ20లో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్ జరిగిందని.. మిగతా మ్యాచ్‌లు అలాగే నిర్వహిస్తామని గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ తెలిపింది. 
 
ఇక ఈ ఏడాది ఏప్రిల్ లో జరగనున్న ఐపీఎల్ 2021 సీజన్ 14పై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. ఏప్రిల్ లోగా కరోనా ఉదృతి కోనసాగితే ఐపీఎల్ కూడా ప్రేక్షకులు లేకుండా నిర్వహించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాకుంటే ఇతర దేశంలో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోందని సమాచారం. గత ఏడాది ఐపీఎల్-13 బయోబుడగ నీడలో యూఏఈలో నిర్వహించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments