Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెలక్షన్ కమిటీని రద్దు చేసిన బీసీసీఐ - కొత్త వారి కోసం దరఖాస్తుల ఆహ్వానం

Webdunia
శనివారం, 19 నవంబరు 2022 (08:58 IST)
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. జాతీయ సెలక్షన్ కమిటీని పూర్తిగా రద్దు చేసింది. ఇటీవల ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీ జరిగింది. ఇందులో భారత జట్టు సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాభవనాన్ని ఎదుర్కొని ఇంటికి చేరుకుంది ఈ ఓటమి బోర్డు పెద్దలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. దీంతో సెలక్షన్ కమిటీని పూర్తిగా రద్దు చేసింది. చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మతో సహా ఆయన సారథ్యంలోని కమిటీ మొత్తంపైనా వేటువేసింది. 
 
పైగా, కొత్త సెలెక్టర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. సీనియర్ పురుషుల జట్టును ఎంపిక చేసేందుకు ఐదుగురు సెలెక్టర్లు కావాలంటూ బీసీసీఐ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. అందుకోసం కొన్ని అర్హతలు కూడా నిర్ధేశించింది. 
 
సెలెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కేనీసం ఏడు టెస్ట్ మ్యాచ్‌లు, 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు లేదా 10 వన్డలు, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడినవారు అర్హులని పేర్కొంది. అలాగే, ఆట నుంచి ఐదేళ్ల క్రితం రిటైరై ఉండాలని తెలిపింది. ఈ దరఖాస్తులను ఈ నెల 28వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు సమర్పించాల్సి ఉంటుందని బీసీసీఐ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

విశాఖలో దారుణం : భర్తపై సలసలకాగే నీళ్లు పోసిన భార్య

హైదరాబాదుకు బూస్టునిచ్చే కొత్త గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు

ఐర్లాండ్‌లో భారతీయుడిపై జాత్యహంకార దాడి...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

తర్వాతి కథనం
Show comments