Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెలక్షన్ కమిటీని రద్దు చేసిన బీసీసీఐ - కొత్త వారి కోసం దరఖాస్తుల ఆహ్వానం

Webdunia
శనివారం, 19 నవంబరు 2022 (08:58 IST)
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. జాతీయ సెలక్షన్ కమిటీని పూర్తిగా రద్దు చేసింది. ఇటీవల ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీ జరిగింది. ఇందులో భారత జట్టు సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాభవనాన్ని ఎదుర్కొని ఇంటికి చేరుకుంది ఈ ఓటమి బోర్డు పెద్దలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. దీంతో సెలక్షన్ కమిటీని పూర్తిగా రద్దు చేసింది. చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మతో సహా ఆయన సారథ్యంలోని కమిటీ మొత్తంపైనా వేటువేసింది. 
 
పైగా, కొత్త సెలెక్టర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. సీనియర్ పురుషుల జట్టును ఎంపిక చేసేందుకు ఐదుగురు సెలెక్టర్లు కావాలంటూ బీసీసీఐ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. అందుకోసం కొన్ని అర్హతలు కూడా నిర్ధేశించింది. 
 
సెలెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కేనీసం ఏడు టెస్ట్ మ్యాచ్‌లు, 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు లేదా 10 వన్డలు, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడినవారు అర్హులని పేర్కొంది. అలాగే, ఆట నుంచి ఐదేళ్ల క్రితం రిటైరై ఉండాలని తెలిపింది. ఈ దరఖాస్తులను ఈ నెల 28వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు సమర్పించాల్సి ఉంటుందని బీసీసీఐ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

తర్వాతి కథనం
Show comments