Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌కు బెట్టింగ్ బెడద : ఆటగాళ్లను హెచ్చరించిన బీసీసీఐ

ఠాగూర్
గురువారం, 17 ఏప్రియల్ 2025 (10:27 IST)
ఐపీఎల్ మ్యాచ్ నిర్వాహకులు, ఫ్రాంచైజీలు, ఆటగాళ్లకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఓ హెచ్చరిక చేసింది. క్రికెటర్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, కామెంటేటర్లుకు బీసీసీఐలోని యాంటీ కరప్షన్ సెక్యూరిటీ యూనిట్ ఈ హెచ్చరిక చేసింది. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యాపారికి బుకీలతో సంబంధాలు ఉన్నాయని, అతడితో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఆ వ్యాపారి చట్ట వ్యతిరేక పనులు చేసేలా వ్యక్తులను ఒత్తిడికి గురిచేస్తున్నాడని పేర్కొంది. 
 
ఐపీఎల్‌లోని వ్యక్తులతో స్నేహం చేసేందుకు, సంబంధాలు పెట్టుకునేందుకు అతడు ప్రయత్నిస్తున్నాడని తెలిపింది. ఖరీదైన బహుమతులు, నగదు ఇవ్వడం ద్వారా ఇప్పటికే అతడు కొంతమందితో పరిచయం పెంచుకున్నాడని, కాబట్టి ఆ వ్యక్తి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అభిమాని వేషంలో మ్యాచ్‌లోనూ, జట్లు బస చేసే హోటళ్ళలోనూ కనిపిస్తున్నాడని తెలిపింది. బీసీసీఐ ప్రకటనతో ఐపీఎల్‌లో కలకలం రేగింది. ఆ వ్యాపారి ఎవరన్న చర్చ ఇపుడు ఐపీఎల్ నిర్వాహకులతో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments