బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీకి కరోనా పాజిటివ్

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (10:05 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కరోనా వైరస్ సోకింది. ఆయనకు నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షా ఫలితాల్లో పాజిటివ్ అని తేలింది. గత రెండు రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతూ వచ్చిన గంగూలీ... అనుమానంతో సోమవారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. 
 
ఇందులో కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన కోల్‌కతాలోని ఫుడ్‌ల్యాండ్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారనీ, ఆయనలో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఆయనతో కాంటాక్ట్ అయిన వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని బీసీసీఐ కోరింది. 
 
కాగా, ఈ యేడాది ఆరంభంలో గంగూలీ గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనకు యాంజియోప్లాస్టీ చికిత్స చేశారు. ఇదిలావుంటే, గతంలో గంగూలీ కుటుంబ సభ్యులు సైతం ఈ వైరస్ బారినపడిన విషయం తెల్సిందే. ఆయన సోదరుడు, తల్లి ఈ వైరస్‌కు చికిత్స తీసుకుని కోలుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Google‌కి బాబు ఇచ్చిన ప్రోత్సహకాలు చూసి గుడ్లు తేలేస్తున్న కర్నాటక ఐటి మినిస్టర్ (Video)

మంత్రి నారాయణగారు నన్నేమన్నారో చూపించండి: వర్మ సూటి ప్రశ్న (video)

కొండా సురేఖ ఇంట్లో అర్థరాత్రి హైడ్రామా.. మా అమ్మ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకునేది? (video)

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

తర్వాతి కథనం
Show comments