Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీకి కరోనా పాజిటివ్

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (10:05 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కరోనా వైరస్ సోకింది. ఆయనకు నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షా ఫలితాల్లో పాజిటివ్ అని తేలింది. గత రెండు రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతూ వచ్చిన గంగూలీ... అనుమానంతో సోమవారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. 
 
ఇందులో కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన కోల్‌కతాలోని ఫుడ్‌ల్యాండ్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారనీ, ఆయనలో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఆయనతో కాంటాక్ట్ అయిన వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని బీసీసీఐ కోరింది. 
 
కాగా, ఈ యేడాది ఆరంభంలో గంగూలీ గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనకు యాంజియోప్లాస్టీ చికిత్స చేశారు. ఇదిలావుంటే, గతంలో గంగూలీ కుటుంబ సభ్యులు సైతం ఈ వైరస్ బారినపడిన విషయం తెల్సిందే. ఆయన సోదరుడు, తల్లి ఈ వైరస్‌కు చికిత్స తీసుకుని కోలుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐఎన్ఎస్ విక్రాంత్‌పై దాడి చేశాం... భారత్‌ను భయపెట్టాం : పాక్ ప్రధాని గొప్పలు

ఉగ్రవాదులకు జ్యోతి మల్హోత్రా పహెల్గాం లొకేషన్ షేర్ చేసిందా?, నాకేం తెలియదంటున్న ఆమె తండ్రి

Chandrababu: మే 22 నుండి మూడు రోజుల పాటు ఢిల్లీలో చంద్రబాబు

ఏపీ లిక్కర్ స్కామ్ : నిందితులకు షాకిచ్చిన ఏసీబీ కోర్టు

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పది శాతం తగ్గింపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

తర్వాతి కథనం
Show comments