Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీకి కరోనా పాజిటివ్

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (10:05 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కరోనా వైరస్ సోకింది. ఆయనకు నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షా ఫలితాల్లో పాజిటివ్ అని తేలింది. గత రెండు రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతూ వచ్చిన గంగూలీ... అనుమానంతో సోమవారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. 
 
ఇందులో కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన కోల్‌కతాలోని ఫుడ్‌ల్యాండ్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారనీ, ఆయనలో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఆయనతో కాంటాక్ట్ అయిన వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని బీసీసీఐ కోరింది. 
 
కాగా, ఈ యేడాది ఆరంభంలో గంగూలీ గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనకు యాంజియోప్లాస్టీ చికిత్స చేశారు. ఇదిలావుంటే, గతంలో గంగూలీ కుటుంబ సభ్యులు సైతం ఈ వైరస్ బారినపడిన విషయం తెల్సిందే. ఆయన సోదరుడు, తల్లి ఈ వైరస్‌కు చికిత్స తీసుకుని కోలుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

తర్వాతి కథనం
Show comments