Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిగివచ్చిన పాకిస్థాన్.. అప్పటివరకు హైబ్రిడ్ విధానంలోనే మ్యాచ్‌ల నిర్వహణ

ఠాగూర్
శుక్రవారం, 6 డిశెంబరు 2024 (09:39 IST)
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) దిగివచ్చింది. వచ్చే యేడాది పాక్ వేదికగా జరగాల్సిన చాంపియన్స్ ట్రోఫీ టోర్నీని హైబ్రిడ్ విధానంలో నిర్వహించేందుకు సమ్మతం తెలిపినట్టు అంతర్జాతీయ క్రికెట్ వర్గాలు సూచన ప్రాయంగా వెల్లడించింది. అయితే, 2027 వరకు భారత్, పాకిస్థాన్ దేశాల్లో అన్ని టోర్నీలు హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని పాకిస్థాన్ పట్టుబట్టింది. 
 
ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత క్రికెట్ జట్టు ఆడే తన మ్యాచ్‌‍లను దుబాయిలో ఆడటానికి కూడా మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌తో సహా వివిధ దేశాల క్రికెట్ బోర్డు డైరెక్టర్లతో ఐసీసీ కొత్త అధ్యక్షుడు జైషా గురువారం దుబాయిలోని ఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిపిన అనధికారిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
 
'2025 ఛాంపియన్స్ ట్రోఫీని యూఏఈ, పాకిస్థాన్‌లో భారత్‌తో కలిసి ఆడాలని హైబ్రిడ్ మోడల్ అన్ని బోర్డులు సూత్రప్రాయంగా అంగీకరించాయి. ఇది అందరి విజయం. మంచి నిర్ణయం' అని ఐసీసీ వర్గాలు పీటీఐకి తెలిపాయి.
 
ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. దీనికోసం మొదట పీసీబీ తాము హైబ్రిడ్ మోడల్‌ను అంగీకరించబోమని, కావాలంటే బాయ్‌కట్ చేస్తామని బెదిరింపు ధోరణిని అవలంభించింది. అయితే, గతవారం జరిగిన సమావేశంలో మెట్టుదిగిన పాక్ బోర్డు హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించింది. 
 
కానీ, 2031 వరకు భారత్, పాకిస్థాన్ దేశాల్లో జరిగే ఐసీసీ టోర్నీలన్నింటినీ ఇదే విధానంలో జరపాలని డిమాండ్ చేసింది. అలా అయితే తాము హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరిస్తామని పేర్కొంది. ఇక తాజా సమావేశంలో ఐసీసీ 2027 వరకు భారత్, పాక్‌లో జరిగే అన్ని టోర్నీలను హైబ్రిడ్ విధానంలో నిర్వహించేందుకు ఒప్పుకుంది. దీనికి పీసీబీ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
 
కాగా, ఈ సమయంలో భారత్ వచ్చే యేడాది అక్టోబరులో మహిళల వన్డే ప్రపంచకప్, 2026లో పురుషుల టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు ఐసీసీ టోర్నీలను హైబ్రిడ్ మోడల్లో భాగంగా శ్రీలంకతో కలిసి భారత్ నిర్వహించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

తర్వాతి కథనం
Show comments