Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌తో భారత్ ఆడట్లేదు.. మ్యాచ్ పాయింట్లలో ఐసీసీ కోత.. బీసీసీఐ సీరియస్

ముంబై పేలుళ్ల అనంతరం టీమిండియా పాకిస్థాన్‌తో క్రికెట్ సిరీస్ ఆడలేదు. ప్రపంచ కప్ మ్యాచ్ మినహాయించి.. పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు భారత్ ముందుకురాలేదు. ఈ నేపథ్యంలో ఐసీసీ, బీసీసీఐ మధ్య సంబంధాలు

Webdunia
బుధవారం, 23 నవంబరు 2016 (16:58 IST)
ముంబై పేలుళ్ల అనంతరం టీమిండియా పాకిస్థాన్‌తో క్రికెట్ సిరీస్ ఆడలేదు. ప్రపంచ కప్ మ్యాచ్ మినహాయించి.. పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు భారత్ ముందుకురాలేదు. ఈ నేపథ్యంలో ఐసీసీ, బీసీసీఐ మధ్య సంబంధాలు మరోసారి దిగజారాయి. పురుషుల క్రికెట్ జట్టు పాకిస్థాన్‌తో కలిసి ఆడే ఛాన్సులు లేకపోవడంతో.. ఇక మహిళల జట్టును ఐసీసీ టార్గెట్ చేసింది. ఈ క్రమంలో ఐసీసీ ఒప్పందం ప్రకారం ఆగస్టు 1 నుంచి అక్టోబర్‌ 31 వరకు పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ ఆడలేదని భారత మహిళల క్రికెట్‌ జట్టుకు ఐసీసీ సాంకేతిక బృందం మ్యాచ్‌ పాయింట్ల కోత విధించింది.   
 
మొత్తం 3 మ్యాచ్‌లకు 2 పాయింట్ల చొప్పున 6 పాయింట్ల కోసింది. 50 ఓవర్లకు సున్నా పరుగుల ప్రకారం రన్‌రేట్‌ను సవరిస్తామని వెల్లడించింది. పాక్‌తో ఆడకపోవడానికి బీసీసీఐ సరైన కారణాలు చూపలేదని సాంకేతిక బృందం పేర్కొంది. అయితే మ్యాచ్ పాయింట్ల కోతపై బీసీసీఐ ఫైర్ అయ్యింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్‌తో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్ ఆడాలన్నా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని.. ఈ విషయం ఐసీసీ ఛైర్మన్‌కు బాగా తెలుసునని బీసీసీఐ స్పందించింది.  
 
పాకిస్థాన్ దాడుల్లో భారత సైనికులు అమరులవుతున్న సంగతి ఐసీసీకి బాగా తెలుసు. అంతేగాకుండా పాకిస్థాన్ క్రికెట్ ఆడాలనే కోరిక చనిపోయింది. తమకు ప్రభుత్వం అనుమతి ఇస్తేనే పాక్‌తో ఆడేందుకు వీలుంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఐసీసీ తిరిగి సరైన బాటలో నడవకుంటే పురుషులతో పాటు మహిళల జట్టూ ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆడదని' బీసీసీఐ హెచ్చరించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అవసరమైతే ఎంపీలతో చేతులు కలుపుతాం.. పోలవరం కోసం పోరాడతాం.. మిథున్ రెడ్డి

అందుకే మా ఓట్లు తెదేపా అభ్యర్థికి వేశాం: భూమన కరుణాకర్ రెడ్డి కాళ్లపై పడి ఏడ్చిన వైసిపి కార్పొరేటర్లు

టెన్త్ విద్యార్థులకు స్టడీ అవర్‌లో స్నాక్స్... మెనూ ఇదే...

డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ ఎన్నిక

ఒకే అబ్బాయిని ఇష్టపడిన ఇద్దరమ్మాయిలు.. ప్రియుడి కోసం నడిరోడ్డుపై సిగపట్లు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

తర్వాతి కథనం
Show comments