Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ : నేడు ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా పోరు

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2023 (12:05 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా గురువారం కీలక పోరు జరుగనుంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగే ఈ పోరు ఇరు జట్లకూ అత్యంత కీలకంగా మారింది. ఆస్ట్రేలియా ఆడిన తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఖంగుతిన్న కంగారులు... ఈ మ్యాచ్‍లో గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది. ఈ పోరులో పటిష్టమైన సౌతాఫ్రికాను ఢీకొంటోంది. 
 
బ్యాటింగ్ విభాగాన్ని బలోపేతం చేసుకోవడంలో భాగంగా ఆల్ రౌండర్ స్టోయినిస్‌ను తుది జట్టులో చేర్చాలనుకుంటోంది. ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆసీస్.. ఈసారి టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో భారత్ చేతిలో ఆరు వికెట్లతో చిత్తయిన సంగతి తెలిసిందే. మరోవైపు శ్రీలంకతో తొలి పోరులో 102 పరుగులతో అద్భుత విజయం సాధించిన సఫారీలు ఇనుమడించిన ఉత్సాహంలో ఉన్నారు. 
 
భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన తీరు ఆసీస్ జట్టు యాజమాన్యాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. కారణం బ్యాటింగ్ దూకుడు లోపించడమే. వార్నర్, స్మిత్ మినహా ఎవరూ 30కిపైగా రన్స్ చేయకపోవడం గమనార్హం. చెపాక్‌లోని స్లో వికెట్‌పై నాణ్యమైన భారత స్పిన్నర్లను ఎదుర్కోవడానికి ఆసీస్ ఆటగాళ్లు ఆపసోపాలు పడ్డారు. ఇది చాలదన్నట్టు రెండో స్పెషలిస్టు స్పిన్నర్ లేకపోవడం కంగారూల కష్టాలను రెట్టింపు చేసింది.
 
ఇక దక్షిణాఫ్రికా విషయానికొస్తే.. శ్రీలంక బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ డికాక్, డుసెన్, మార్క్రమ్ సెంచరీలతో దుమ్మురేపడంతో ఆ జట్టు బ్యాటింగ్ తిరుగులేకుండా ఉంది. కానీ రబాడ, ఎంగిడి, జాన్సెన్ పేస్ త్రయం పరుగులను నియంత్రించడంలో విఫలమవుతోంది. వరల్డ్ కప్‌కు ముందు తమ దేశంలో ఆసీస్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్ లో 0-2తో వెనుకంజలో నిలిచిన సౌతాఫ్రికా ఆపై అనూహ్యంగా పుంజుకొని 3-2తో నెగ్గింది. దీంతో వరల్డ్ కప్ పోరులో కంగారూలపై సఫారీలదే పైచేయి అయ్యే చాన్సుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

తర్వాతి కథనం
Show comments