Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభ్‌మన్ గిల్ మెరుపు ఇన్నింగ్స్ వృధా: బంగ్లాదేశ్ చేతిలో ఓడిన భారత్

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (23:41 IST)
India vs Bangladesh
ఆసియా కప్ సూపర్ - 4 చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలైంది. భారత్- బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో శుభ్ మన్ గిల్ సెంచరీతో మెరిసినా ఫలితం లేకపోయింది.  చివరి ఓవర్లో 12 పరుగులు కొడితే విజయం దక్కుతుందనగా.. క్రీజులో వుండిన షమీ బంతులను వృధా చేయడంతో ఈ మ్యాచ్ ఫలితం ఓటమిగా మారిపోయింది. నాలుగో బంతిని ఫోర్‌గా మలిచి.. డబుల్ తీయబోయి రనౌట్ అయ్యాడు. దీంతో ఛేదనలో 49.5 ఓవర్లలో 259 పరుగులకు భారత్ ఆలౌట్ అయ్యింది. 
 
అంతకుముందు బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసింది. తదనంతరం బరిలోకి దిగిన భారత ఆటగాళ్లలో 133 బంతుల్లో 121 పరుగులు చేసిన గిల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో అక్షర్ పోరాడాడు. కానీ మిగిలిన బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేయడంతో భారత్ పరాజయం చవిచూసింది. బంగ్లాదేశ్‌ను విజయం వరించింది. 
 
భారత ఆటగాళ్లలో సూర్యకుమార్ యాదవ్ 26, అక్షర్ 34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 42 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజూర్ రెహ్మాన్ 3, టాంజిమ్ హసన్ సకీబ్ 2, మహెదీ హసన్ 2, మెహెదీ హసన్ మిరాజ్ 1, కెప్టెన్ షకీబల్ హసన్ 1 వికెట్ తీశారు. సూపర్-4లో బంగ్లాదేశ్ జట్టుకు ఇదే తొలి విజయం. ఇక, ఈ నెల 17న జరిగే ఫైనల్లో భారత్, శ్రీలంక తలపడనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిని అలా నిర్మించనున్న సర్కారు.. ఎలాగో తెలుసా?

జానీపై సీరియస్ అయిన జనసేనాని.. సస్పెండ్ చేసిన పవన్

వైకాపా అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామల.. బాబు, పవన్‌లపై ఫైర్

లడ్డూ వేలం విజయవంతం.. సంతోషంలో డ్యాన్స్ చేసి కుప్పకూలిపోయాడు..

భూమి మీదికి కొత్త చంద్రుడు రాబోతున్నాడు, ఎన్ని రోజులు వుంటాడో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

తర్వాతి కథనం
Show comments