Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా కప్ క్రికెట్ టోర్నీ షెడ్యూల్ రిలీజ్ - భారత్ పాక్ మ్యాచ్ ఎక్కడంటే!

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2023 (09:59 IST)
ఆసియా దేశాల మధ్య జరిగే క్రికెట్ పోటీలకు సంబంధించిన షెడ్యూల్‌ను తాజాగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ తాజాగా వెల్లడించింది. ఈ క్రికెట్ టోర్నీ ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబరు 17వ తేదీ వరకు జరుగనుంది. ఆ టోర్నీకి శ్రీలంక, పాకిస్థాన్ జట్లు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. పాకిస్థాన్ దేశంలో నాలుగు మ్యాచ్‌లను నిర్వహిస్తారు. మిగిలిన మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరుగుతాయి. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూపులో ఉన్నాయి. 
 
16వ ఆసియా కప్ టోర్నీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్, నేపాల్ జట్లు తలపడతాయి. టోర్నీలో 13 వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నీ తొలి దశలో మొత్తం ఆరు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఈ రెండు గ్రూపుల్లో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-4కు చేరుకుంటాయి. సూపర్-4 దశలో ఈ నాలుగు జట్లలో టాప్-2లో నిలిచే జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అయితే, భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూపులో ఉండగా, శ్రీలంక, ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు మరో గ్రూపులో ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

తర్వాతి కథనం
Show comments