Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా కప్ క్రికెట్ టోర్నీ షెడ్యూల్ రిలీజ్ - భారత్ పాక్ మ్యాచ్ ఎక్కడంటే!

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2023 (09:59 IST)
ఆసియా దేశాల మధ్య జరిగే క్రికెట్ పోటీలకు సంబంధించిన షెడ్యూల్‌ను తాజాగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ తాజాగా వెల్లడించింది. ఈ క్రికెట్ టోర్నీ ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబరు 17వ తేదీ వరకు జరుగనుంది. ఆ టోర్నీకి శ్రీలంక, పాకిస్థాన్ జట్లు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. పాకిస్థాన్ దేశంలో నాలుగు మ్యాచ్‌లను నిర్వహిస్తారు. మిగిలిన మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరుగుతాయి. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూపులో ఉన్నాయి. 
 
16వ ఆసియా కప్ టోర్నీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్, నేపాల్ జట్లు తలపడతాయి. టోర్నీలో 13 వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నీ తొలి దశలో మొత్తం ఆరు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఈ రెండు గ్రూపుల్లో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-4కు చేరుకుంటాయి. సూపర్-4 దశలో ఈ నాలుగు జట్లలో టాప్-2లో నిలిచే జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అయితే, భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూపులో ఉండగా, శ్రీలంక, ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు మరో గ్రూపులో ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మోడీ మాస్టర్ ప్లాన్.. బీజేపీలో వైకాపా విలీనం!!?

మాలీలో ఘోరం.. బంగారు గనిలో దుర్ఘటన - 10 మంది కూలీలు మృతి

నా తోట సరే... పక్కనే చంద్రబాబు తోట కూడా వుందిగా, దాని సంగతేంటి? పెద్దిరెడ్డి జస్ట్ ఆస్కింగ్

ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు

తిరుమల శిలాతోరణం వద్ద చిరుతపులి కలకలం : తితిదే అలెర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

తర్వాతి కథనం
Show comments