Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా కప్... అబ్బా... వామ్మో అనిపించారుగా... టీమిండియా చంపేసింది...

ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ చూసినవారికి బీపీ వుంటే మాత్రలు మీద మాత్రలు వేసుకోవాల్సిందే. చివరి బంతి వరకూ మహా ఉత్కంఠగా పోరు జరిగింది. లక్ష్యం స్వల్పమైనా బంగ్లాదేశ్ బౌలర్లు టీమిండియా బ్యాట్సమన్లకు చుక్కలు చూపించారు. ఐతే టీమిండియా ఆటగాళ్లు తమ ఆత్మవిశ్వాసం కోల

Webdunia
శనివారం, 29 సెప్టెంబరు 2018 (07:19 IST)
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ చూసినవారికి బీపీ వుంటే మాత్రలు మీద మాత్రలు వేసుకోవాల్సిందే. చివరి బంతి వరకూ మహా ఉత్కంఠగా పోరు జరిగింది. లక్ష్యం స్వల్పమైనా బంగ్లాదేశ్ బౌలర్లు టీమిండియా బ్యాట్సమన్లకు చుక్కలు చూపించారు. ఐతే టీమిండియా ఆటగాళ్లు తమ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చివరి వరకూ పోరాడి గెలిచి శభాష్ అనిపించుకున్నారు. 
 
223 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా చివరి బంతి వరకూ చంపేసిందంటే నమ్మండి. గెలుస్తారా లేదా అనే ఉత్కంఠతో భారత్ క్రీడాభిమానులు ఉత్కంఠతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఓపెనర్లు రోహిత్ శర్మ (48), శిఖర్ ధవన్ (15) శుభారంభాన్ని ఇచ్చినప్పటికీ వాళ్లు ఔట్ కాగానే పరిస్థితి మారిపోయింది. అంబటి రాయుడు కేవలం 2 పరుగులు చేసి పెవిలియన్ దారి పట్టాడు. ఆ తర్వాత వచ్చిన ధోనీ, దినేష్ జాగ్రత్తగా ఆడారు. ఇక ఫర్వాలేదులే... ఇండియా గెలుపుకు ఢోకా వుండదు అనకుంటున్న తరుణంలో ధోనీ ఔట్. జాదవ్ రిటైర్డ్ హర్ట్. ఇక అంతే... భారత్ గెలుపు కష్టమైనట్లు కనిపించింది. 
 
మరోవైపు బంగ్లా బౌలర్లు టీమిండియాపై గట్టి పట్టును ప్రదర్శించారు. ఐతే రవీంద్ర జడేజా (23), భువనేశ్వర్ కుమార్ (21) బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. చివరి బంతికి వరకూ ఉత్కంఠగా సాగిన పోరులో టీమిండియా ఆసియా కప్ కైవసం చేసుకుని తమకు తిరుగులేదని నిరూపించుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది మన దేశ ఉగ్రవాదులా? చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాదులో రేవ్ పార్టీని చేధించిన EAGLE.. తొమ్మిది మంది అరెస్ట్

Jagan: సెంట్రల్ జైలుకు వెళ్లనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎందుకు?

నేడు ఆపరేషన్ సింధూర్‌పై వాడివేడిగా చర్చ..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments