Webdunia - Bharat's app for daily news and videos

Install App

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌‌లో హషీమ్ ఆమ్లా: షాన్ మార్ష్ స్థానంలో బరిలోకి?

Webdunia
బుధవారం, 4 మే 2016 (17:20 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొమ్మిదో సీజన్లో దక్షిణాఫ్రికా సీనియర్ బ్యాట్స్‌మన్ హషీమ్ ఆమ్లా అరంగేట్రం చేయబోతున్నాడు. ఫిబ్రవరిలో జరిగిన వేలానికి వచ్చినా ఆమ్లా అమ్ముడుపోలేదు. ఈ నేపథ్యంలో గాయపడిన షాన్ మార్ష్ స్థానంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆమ్లాను జట్టులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.  
 
కాగా మే ఒకటో తేదీన జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గుజరాత్ లయన్స్ జట్టుపై గెలుపును నమోదు చేసుకుంది. రాజ్ కోట్ వేదికగా జరిగిన 28వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్లు సత్తా చాటడంతో ఐపీఎల్ 9లో రెండో విజయం సాధించింది. 
 
154 పరుగులకు పంజాబ్ ఆలౌట్ అయ్యింది. అనంతరం 155 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ బ్యాట్స్ మన్‌కు పంజాబ్ బౌలర్లు బంతితో నిప్పులు చెరిగి, తిరుగులేని లైన్ అండ్ లెంగ్త్‌తో చుక్కలు చూపించారు. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ జట్టు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments