Webdunia - Bharat's app for daily news and videos

Install App

చివరి టెస్టుకు ముందు భారత్‌కు బ్యాడ్ న్యూస్... ఏంటది?

ఠాగూర్
గురువారం, 2 జనవరి 2025 (13:08 IST)
బోర్డర్ - గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా, భారత్ -  ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య శుక్రవారం నుంచి చివరిదైన ఐదో టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఈ సిరీస్‌లో భాగంగా, ఇప్పటివరకు నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ముగియగా, ఆస్ట్రేలియా జట్టు 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఈ నేపథ్యంలో సిడ్నీ వేదికగా చివరి టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ మాత్రం వర్షం కారణంగా రద్దు అయినా, మ్యాచ్ డ్రా అయినా టెస్ట్ సిరీస్‌ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంటుంది. దీంతో చివరి టెస్ట్ మ్యాచ్‌ను భారత్ పకడ్బందీగా, అత్యుత్తమ జట్టుతో ఆడాల్సివుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతం గంభీర్ ఓ బ్యాడ్ న్యూస్ ప్రకటించారు. 
 
సిడ్నీ వేదికగా జరిగే ఐదో టెస్ట్ మ్యాచ్‌కు పేసర్ ఆకాశ్ దీప్ అందుబాటులో ఉండడని, అతను వెన్ను నొప్పితో బాధపడుతున్నాడని గంభీర్ ప్రకటించాడు. సిడ్నీ పిచ్‌ను పరిశీలించిన అనంతరం తుది జట్టును ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం జ రిగిన ప్రీ మ్యాచ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ పరిణామంతో మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. కాగా, ఆకాశ్ దీప్ రెండు టెస్టుల్లో కలిపి 87.5 ఓవర్లు బౌలింగ్ చేసి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఫీల్డర్లు మరికొన్ని క్యాచ్‌లను జారవిడిచారు. ఈ క్రమంలో ఆకాశ్ దీప్ స్థానంలో హర్షిత్ రాణా లేదా ప్రసిద్ధ్ కృష్ణలలో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు.. బాలికలదే పైచేయి-71.37 శాతం ఉత్తీర్ణత

నా ఫోన్ లాక్కుంటారా? టీచర్‌ని చెప్పుతో కొట్టిన విద్యార్థిని (video)

వివాహితతో ప్రియుడు రాసలీల, భర్త రావడంతో ట్రంకు పెట్టెలో దాక్కున్న ప్రియుడు (video)

పెళ్లైన 15 రోజులకే భార్యను వదిలేశాడు.. ఒకే ఇంట్లో ప్రేయసితో వుండమంటే.. ?

Crime News : భార్య, అత్తపై క్యాబ్ డ్రైవర్ కత్తితో దాడి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jwala Gutta: మా నాలుగో వార్షిక సంవత్సరం.. జ్వాలా గుత్తాకు ఆడబిడ్డ.. విష్ణు విశాల్

Ashu Reddy: అషు రెడ్డి బ్రెయిన్ సర్జరీ-ఇదే జీవితం.. ఇతరుల పట్ల దయతో వుండండి

మహేష్ బాబు కు ఈడీ నోటీసులు వల్ల ప్రయోజనం ఏమిటి?

మహేష్ బాబుకు షాక్- ఈడీ నోటీసులు జారీ.. 27న విచారణకు హాజరు

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments