మొన్న రోహిత్ శర్మ.. నేడు విరాట్ కోహ్లీ.. భారత్‌కు గాయాల బెడద

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (14:59 IST)
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలో గురువారం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత్‌కు గాయాలబెడద ఎక్కువైంది. ఇటీవల ప్రాక్టీస్ చేస్తుండగా, కెప్టెన్ రోహిత్ శర్మ మోచేతికి గాయమైంది. బుధవారం మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గాయపడ్డారు. 
 
నెట్ ప్రాక్టీస్‌ చేస్తున్నపుడు పేసర్ హర్షల్ పటేల్ వేసిన ఓ బంతి గజ్జల్లో తగలడంతో కోహ్లీ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. పైగా, నొప్పి ఎక్కువ కావడంతో ప్రాక్టీస్ మానేసి వెళ్లిపోయాడు. దీంతో కోహ్లీకి బలమైన గాయమే తగిలివుంటుందన్న ఆందోళన మొదలైంది. 
 
కాగా, కెప్టెన్ రోహిత్ శర్మ మంగళారం ఇలానే స్వల్ప గాయానికే గురయ్యాడు. త్రౌ డౌన్ స్పెషలిస్ట్ రఘు వేసిన బంతి రోహిత్ కుడి ముంజేయికి గట్టిగా తగిలింది. దీంతో రోహిత్ శర్మ నొప్పితో విలవిలలాడు. అయితే, 40 నిమిషాల తర్వాత రోహిత్ మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 
 
ఈ పరిస్థితుల్లో బుధవారం విరాట్ కోహ్లీకి బంతి గజ్జల్లో తగిలిన తర్వాత ఆయన నెట్ నుంచి వెళ్లిపోవడం ఇపుడు ఆందోళనకు గురిచేస్తుంది. ఇప్పటివరకు కోహ్లీ ఆడిన ఐదు మ్యాచ్‌లలో 123 సగటుతో 246 పరుగులు చేసిన విషయం తెల్సిందే. ఇపుడు గురువారం ఇంగ్లండ్‌తో జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడో లేదో వేచిచూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో వింత వ్యాధి : చిన్నారి శరీరమంతా బొబ్బలే (వీడియో)

#JEEMain2026 షెడ్యూల్ రిలీజ్... జనవరి నెలలో మెయిన్స్ పరీక్షలు

రూ.2 కోట్లు ఎదురు కట్నమిచ్చి 24 యేళ్ల యువతిని పెళ్లాడిన 74 యేళ్ల తాత!!

ఒకే వేదికపై ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు

ఆ స్వీట్ చాలా కాస్ట్లీ గురూ... స్వర్ణ ప్రసాదం రూ.1.11 లక్షలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

తర్వాతి కథనం
Show comments