Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎట్టకేలకు నా భర్తను చూడబోతున్నా: ధోనీ మిసెస్ సాక్షి

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2015 (12:30 IST)
టీమిండియా వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. టీమిండియా నిష్క్రమణపై అన్నివైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతుంటే.. కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి సింగ్ ధోనీ మాత్రం టీమిండియా పోరాట పటిమను ఆకాశానికెత్తేసింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్‌లో ఆసక్తికర వ్యాఖ్యలను పోస్ట్ చేసింది. ‘‘శక్తిమేర పోరాడారు. చాలా గర్వంగా ఉంది. కొన్ని మ్యాచ్‌ల్లో గెలిస్తే, కొన్నింటిలో ఓడిపోతుంటాం. ఏదేమైనా ఎట్టకేలకు నా భర్తను చూడబోతున్నా’’ అంటూ ఆమె ట్వీట్ చేసింది.
 
కాగా ధోనీ సతీమణి సాక్షి ఇటీవల ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఆ పాపను కూడా చూసేందుకు ధోనీ రాలేదు. వరల్డ్ కప్ కోసం విదేశాల్లోనే ఉండిపోయాడు. ఈ నేపథ్యంలో సాక్షి తన భర్తను చూడబోతున్నానని హర్షం వ్యక్తం చేసింది. పాప కోసం ధోనీ కూడా ఆత్రుతగా ఇంటిదారి పట్టాడు. అయితే టీమిండియా వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించడం చాలా నిరాశపరిచిందని ధోనీ వ్యాఖ్యానించాడు. 

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

కర్నూలు జిల్లా తుగ్గలిలో బంగారు గని... దేశంలో తొలి ప్రైవేట్ మైన్!!

పెద్దగా ఆవలించింది... దవడ లాక్ అయిపోయింది...

జగన్ లండన్ ట్రిప్.. ఏమవుతుందోనని ఆందోళన.. అయినా భయం లేదు..

బాలుడి ప్రాణాల రక్షణ కోసం ఏకమైన ప్రజలు - రూ.17.5 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ కోసం సాయం!!

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

Show comments