ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్ను మంగళవారం ఆడనుంది. ఇందులోభాగంగా తొలి ప్రత్యర్థి హాంకాంగ్ జట్టుతో తలపడనుంది. ఆసియాకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో విజేతగా నిలువడం ద్వారా ప్రధాన రౌండ్లోకి హా
ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్ను మంగళవారం ఆడనుంది. ఇందులోభాగంగా తొలి ప్రత్యర్థి హాంకాంగ్ జట్టుతో తలపడనుంది. ఆసియాకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో విజేతగా నిలువడం ద్వారా ప్రధాన రౌండ్లోకి హాంకాంగ్ జట్టు ప్రవేశించింది. దీంతో టాప్ ఫేవరేట్ టీమ్ అయిన భారత్తో తలపడనుంది.
ఇకపోతే, తన తొలి మ్యాచ్లో పాకిస్థాన్ చేతిలో భారీ ఓటమిని చవిచూసిన హాంకాంగ్... మంగళవారం మ్యాచ్లో సత్తాచాటేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు, క్రికెట్ పసికూనే అని తేలికగా తీసుకోకుండా పక్కా ప్రణాళికతో పడగొట్టాలని చూస్తోంది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే… మంగళవారం మ్యాచ్తో భారత్ ఖాతాలో భారీ విజయం చేరినట్లే.
చాంపియన్స్ ట్రోఫీ తర్వాత పాకిస్థాన్తో తొలిసారి తలపడబోతున్న భారత్.. హాంకాంగ్తో మ్యాచ్ ద్వారా జట్టు కూర్పుపై దృష్టి పెట్టింది. ధవన్తో కలిసి కెప్టెన్ రోహిత్ ఓపెనింగ్కు వచ్చే అవకాశముండగా, కేదార్ జాదవ్, అంబటి రాయడు, మనీశ్ పాండే, కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్ మధ్య మిడిలార్డర్ పోటీ నెలకొని ఉంటుంది.