టీమిండియాలో నితీశ్ స్థానం పదిలం : సునీల్ గవాస్కర్

ఠాగూర్
బుధవారం, 1 జనవరి 2025 (11:11 IST)
భారత క్రికెట్ జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో ఆపద్బాంధవుడులా సెంచరీ సాధించడంతో పాటు.. జట్టును ఫాలోఆన్ గండం నుంచి గట్టెంకించిన ఆంధ్రా క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిపై లెజెండ్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. భారత జట్టులో నితీశ్ స్థానం పదిలమన్నారు. 
 
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కష్టాల్లో ఉన్న సమయంలో యువ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అద్భుత సెంచరీ సాధించిన విషయం తెల్సిందే. నితీశ్‌కు టెస్టు కెరీర్‌లో ఇదే తొలి సెంచరీ. మెల్‌బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్ 114 పరుగులు చేశాడు. అయితే, ఈ ఇన్నింగ్స్‌లో జట్టు గెలవలేకపోయింది.
 
కానీ, తొలి టెస్ట్ మ్యాచ్ ఆడిన నితీశ్ కుమార్‌ ఆట తీరు మాత్రం ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేసింది. అందుకే క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ స్పందించారు. ప్రతి టెస్ట్ మ్యాచ్‌లో రోజురోజుకూ రాణించాడని అన్నారు. మెల్‌‌బోర్న్‌లో భారత జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో సెంచరీ సాధించి జట్టులో తన స్థానాన్ని పటిష్ఠం చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడని చెప్పారు. 
 
హార్దిక్ టెస్ట్ క్రికెట్‌కు దూరమైన నాటి నుంచి మీడియం పేస్ బౌలింగ్, బ్యాటింగ్ చేయగల ఆల్ రౌండర్ కోసం భారత్ ఎదురుచూస్తోందని అన్నారు. నితీశ్ బౌలింగ్ పురోగమిస్తుందన్నారు. కెరీర్ మొదట్లో హార్థిక్ కంటే నితీశ్ మెరుగ్గా కనిపించాడని చెప్పారు. ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో నితీశ్ ఇప్పటి వరకు 294 పరుగులు చేయడంతో పాటు మూడు వికెట్లు పడగొట్టాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Google‌కి బాబు ఇచ్చిన ప్రోత్సహకాలు చూసి గుడ్లు తేలేస్తున్న కర్నాటక ఐటి మినిస్టర్ (Video)

మంత్రి నారాయణగారు నన్నేమన్నారో చూపించండి: వర్మ సూటి ప్రశ్న (video)

కొండా సురేఖ ఇంట్లో అర్థరాత్రి హైడ్రామా.. మా అమ్మ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకునేది? (video)

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

తర్వాతి కథనం
Show comments