Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలిటెస్టు: సెహ్వాగ్ సెంచరీ - రాణించిన జాఫర్

Webdunia
శుక్రవారం, 28 మార్చి 2008 (11:13 IST)
భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన బ్యాట్‌కు పని చెప్పాడు. దీంతో తన బ్యాటింగ్ పదును సఫారీలకు రుచి చూపించాడు. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పటిష్టమైన దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న తొలి టెస్టులో తన వీరబాదుడుతో టెస్టుల్లో 14వ సెంచరీ (104 నాటౌట్)ని పూర్తి చేశాడు. వన్డేను తలపించే రీతిరో ఆడిన సెహ్వాగ్ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. అలాగే మరో ఓపెనర్ వసీం జాఫర్ కూడా క్రీజ్‌లో కుదురుకొని అర్థ సెంచరీతో రాణించాడు. దీంతో భారత జట్టు 165 పరుగులతో భారీ స్కోరు దిశగా ముందుకు సాగుతోంది. అంతకుముందు దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 540 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెల్సిందే.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు రెండో రోజు ఆట పూర్తయ్యే సమయానికి వికెట్ నష్టపోకుండా 82 పరుగులు చేసింది. రెండో రోజు ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఉదయం ఆటను ప్రారంభించిన భారత ఓపెనర్లు సఫారీల బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొన్నారు. జాఫర్, సెహ్వాగ్‌లు ఓపెనింగ్ భాగస్వామ్యంగా 165 పరుగులు చేశారు. భారత ఓపెనింగ్ జోడీని విడగొట్టేందుకు దక్షిణాఫ్రికా కెప్టెన్ గ్రేమ్ స్మిత్ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించిన ఫలితం కనిపించలేదు. ఇప్పటి వరకు సఫారీలు 40 ఓవర్లు బౌల్ చేసినా ఒక్క వికెట్ కూడా తీయలేక పోయారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చింతల్‌కుంట వద్ద తెగిపడిన హైటెన్షన్ వైర్లు - ఇద్దరు సజీవదహనం

ఫ్లైట్‌లో ఏసీ పని చేయడం లేదు... ఏదో తేడాగా ఉంది.. భర్తకు ఫోన్ చేసిన భార్య.. అంతలోనే...

అహ్మదాబాద్ విమాన ప్రమాదం : వివరమ ఇచ్చిన టర్కీ సంస్థ

సీఐను కొట్టేందుకు వెళ్లిన చెవిరెడ్డి - అడ్డుకున్న డీఎస్సీ

బంగాళాఖాతంలో ఉపరితలం ఆవర్తనం.. నేడు భారీగా వర్షాలు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Show comments