Webdunia - Bharat's app for daily news and videos

Install App

కఠినంగా లాక్ డౌన్.. తాట తీస్తున్న పోలీసులు.. ఐసోలేషన్‌ సెంటర్‌కు పంపేశారు..

Webdunia
ఆదివారం, 6 జూన్ 2021 (21:09 IST)
కరోనాను నియంత్రించేందుకు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో... పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా అనవసరంగా బయట తిరిగే యువకులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్‌ చేస్తున్నారు. 
 
ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. మహారాష్ట్ర సరిహద్దు జిల్లా కావడంతో అత్యధికంగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో లాక్‌డౌన్‌ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. 
 
జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బయట తిరుగుతున్న 14 మంది ఆకతాయిలకు కరోనా రాపిడ్ టెస్టులు నిర్వహించి, ఐసోలేషన్‌కు తరలించారు. జైపూర్, పెగడపల్లి, గంగిపల్లి, ఎలకంటీ, షేట్ పల్లి, గ్రామాలలో పెట్రోలింగ్ చేస్తుండగా యువకులు బలాదూర్‌గా తిరగుతూ పోలీసులకు చిక్కారు. 
 
కరోనాతో తమకు సంబంధం లేదన్నట్టు బాధ్యతా రాహిత్యంతో నిబంధనలు గాలికి వదిలి బయట తిరుగుతున్నారు. దీంతో 14 మందిని పట్టుకొని వారికి రాపిడ్ టెస్ట్‌లు నిర్వహించారు. వారందరికీ నెగిటివ్ వచ్చినా.. నిబంధనలు ఉల్లంఘించినందుకు బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు.
 
జైపూర్ మండలంలోని ప్రతి గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. అనవసరంగా బయట తిరిగే వ్యక్తులకు రాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలని లేదంటే ఐసోలేషన్‌కు తరలిస్తామని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments