Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతులు లక్షన్నర మంది

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (09:44 IST)
కరోనా వైరస్ దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటివరకు ఏకంగా లక్షన్నర మంది మృత్యువాతపడ్డారు. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా 22 లక్షలకు చేరుకోగా, మరో దాదాపు ఆరు లక్షల మంది ఈ వైరస్ బారినపడి కోలుకున్నారు. 
 
తాజాగా వెల్లడైన లెక్కల ప్రకారం ఇప్పటివరకు కరోనా వైరస్ సోకి 1,54,25 మంది చనిపోయారు. వరల్డ్ వైడ్‌గా 22,50,683 పాజిటివ్ కేసులు ఉన్నాయి. అలాగే, 5,72,076 మంది ఈ వైరస్ బారినపడి కోలుకున్నారు. 
 
ఇకపోతే, అత్యధిక కరోనా మరణాలు నమోదైన దేశంగా అగ్రరాజ్యం అమెరికా ఉంది. ఇక్కడ ఇప్పటికే ఏకంగా 32,230 మంది చనిపోయారు. అలాగే, స్పెయిన్‌లో 20,002 మంది, ఇటలీలో 22,745 మంది, ఫ్రాన్స్‌లో 18,681, జర్మనీలో 4,352, బ్రిటన్‌లో 14,576, చైనాలో 4,632, ఇరాన్‌లో 4,958, టర్కీలో 1,769, బెల్జియం‌లో 5,163, బ్రెజిల్‌లో 2,171, కెనడాలో 1301, కెనడాలో 3,459, స్విట్జర్లాండ్‌లో 1,327 మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇకపోతే, భారత్‌లో మాత్రం ఈ మరణాలు కేవలం 480గా ఉన్నాయి. అలాగే, కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా 14378గా నమోదయ్యాయి. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇండోర్‌లో 50 కొత్త  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 1360 కేసులు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుటుంబంతో కలిసి ఓజీ చూశాను : చిరంజీవి

Pawan Kalyan OG Response: తెలంగాణ, ఆంధ్రలోనూ ఓజీ పరిస్థితి ఏమిటి..

Chiru: 4కే కన్వర్షన్ తో రీ రిలీజ్ అవుతున్న చిరంజీవి కౌబాయ్ మూవీ కొదమసింహం

Ram: సెట్స్ నుండి ఆంధ్రకింగ్ తాలూకా గ్యాంగ్ ఏమంటున్నారంటే...

నాని ప్యారడైజ్‌లో డ్రాగన్ హీరోయిన్ కయాదు లోహర్..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

తర్వాతి కథనం
Show comments