లాక్ డౌన్ విధించకపోతే ఏప్రిల్ 15 నాటికి 8,00,000 మందికి కరోనా: లవ్ అగర్వాల్

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2020 (19:32 IST)
భారతదేశం తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రశంసించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ విధించడమే కాదు... దాన్ని పగడ్బందీగా ఎలా అమలు చేయాలన్నదానిపై ఖచ్చితమైన ప్రణాళిక వుండాలి. అలా లేనట్లయితే లాక్ డౌన్ విధించినా ఫలితాలు శూన్యమేనని కొన్ని దేశాలు నిరూపిస్తున్నాయి. 
 
ఇకపోతే లాక్ డౌన్ గురుంచి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ శనివారం నాడు విలేకరులతో మాట్లాడారు. భారతదేశంలో లాక్ డౌన్ విధించకుండా వున్నట్లయితే కోవిడ్ -19 కేసులు ఏప్రిల్ 15 నాటికి 8.2 లక్షలకు చేరే అవకాశం వుండేదని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయం వల్ల కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలిగామన్నారు.
 
కాగా గత 24 గంటల్లో 1,035 కొత్త కేసులు, 40 మరణాలు సంభవించాయి. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 7,447కు చేరుకుంది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితులకు అవసరమైన చికిత్స సామగ్రిని పూర్తిస్థాయిలో అందుబాటులో వుంచుతున్నట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర

Suriya: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లా వినోదాన్ని పంచగల హీరో రవితేజ: సూర్య

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments