Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్ విధించకపోతే ఏప్రిల్ 15 నాటికి 8,00,000 మందికి కరోనా: లవ్ అగర్వాల్

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2020 (19:32 IST)
భారతదేశం తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రశంసించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ విధించడమే కాదు... దాన్ని పగడ్బందీగా ఎలా అమలు చేయాలన్నదానిపై ఖచ్చితమైన ప్రణాళిక వుండాలి. అలా లేనట్లయితే లాక్ డౌన్ విధించినా ఫలితాలు శూన్యమేనని కొన్ని దేశాలు నిరూపిస్తున్నాయి. 
 
ఇకపోతే లాక్ డౌన్ గురుంచి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ శనివారం నాడు విలేకరులతో మాట్లాడారు. భారతదేశంలో లాక్ డౌన్ విధించకుండా వున్నట్లయితే కోవిడ్ -19 కేసులు ఏప్రిల్ 15 నాటికి 8.2 లక్షలకు చేరే అవకాశం వుండేదని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయం వల్ల కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలిగామన్నారు.
 
కాగా గత 24 గంటల్లో 1,035 కొత్త కేసులు, 40 మరణాలు సంభవించాయి. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 7,447కు చేరుకుంది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితులకు అవసరమైన చికిత్స సామగ్రిని పూర్తిస్థాయిలో అందుబాటులో వుంచుతున్నట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments