Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మంత్రి ధర్మేంద ప్రధాన్‌కు కరోనా పాజిటివ్

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (10:19 IST)
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కరోనా వైరస్ సోకింది. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో ఉన్న మంత్రుల్లో కరోనా వైరస్ సోకిన మంత్రుల సంఖ్య రెండుకు చేరింది. ఇప్పటికే కేంద్రం హోం మంత్రి అమిత్ షాకు ఈ వైరస్ సోకగా, ఆయన గుర్గావ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. 
 
ఇపుడు కేంద్ర ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే డాక్టర్ల సూచనతో గురుగ్రామ్‌లోని మేదాంత ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.
 
కాగా, తనకు కరోనా సోకడం పట్ల ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేశారు. లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని, రిపోర్టులో పాజిటివ్ అని వచ్చిందని వెల్లడించారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు.
 
మరోవైపు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కాంటాక్ట్ అయిన కేంద్ర మంత్రులు రవిశంకర ప్రసాద్, బాబుల్‌లు ఇప్పటికే సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. అలాగే, మరికొందరు ప్రభుత్వ సీనియర్ అధికారులు కూడా హోం క్వారంటైన్‌లో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments