ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌తో 90 శాతం రక్షణ : ఇంగ్లండ్ ప్రజారోగ్య శాఖ

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (14:01 IST)
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనికా ఫార్మా దిగ్గజం కలిసి సంయుక్తంగా తయారు చేసిన కరోనా టీకా వల్ల 90 శాతం మేరకు రక్షణ ఉంటుందని ఇంగ్లండ్ ప్రజారోజ్యం శాఖ వెల్లడించింది. ఆస్ట్రాజెనికా కంపెనీకు చెందిన రెండు డోసుల టీకాలు వేసుకుంటే.. కోవిడ్ నుంచి సుమారు 90 శాతం ర‌క్ష‌ణ ఉంటుంద‌ని తెలిపింది. దీనికి సంబంధించిన డేటాను ప‌బ్లిక్ హెల్త్ శాఖ రిలీజ్ చేసింది. 
 
ఈ నెల 9వ తేదీ నాటికి ఇంగ్లండ్‌లో 60 ఏళ్లు దాటిన‌వారిలో.. సుమారు 13000 మ‌ర‌ణాల‌ను నియంత్రించ‌గ‌లిగిన‌ట్లు ఆ దేశ ఆరోగ్య సంస్థ చెప్పింది. ఇక వ్యాక్సిన్లు ఇవ్వ‌డం వ‌ల్ల 65 ఏళ్లు దాటిన‌వారిలో సుమారు 40 వేల మంది హాస్పిట‌ల్‌ ఇబ్బందుల నుంచి దూర‌మైన‌ట్లు డేటాలో వెల్ల‌డించారు. 
 
మ‌హ‌మ్మారి క‌రోనా వల్ల ఇంగ్లండ్ భారీ స్థాయిలో మ‌ర‌ణాలు సంభ‌వించాయి. కానీ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ త‌ర్వాత ఆ విప‌త్తు ఆగిన‌ట్లు తెలుస్తోంద‌ని ప‌బ్లిక్ హెల్త్ పేర్కొన్న‌ది. కోవిడ్ 19 నుంచి వ్యాక్సిన్లు మ‌న ప్రాణాలు కాపాడుతాయ‌న్న విష‌యం తాజా డేటా స్ప‌ష్టం చేస్తున్న‌ద‌ని ఆరోగ్య‌శాఖ మంత్రి మ్యాట్ హాన్‌కాక్ తెలిపారు. 
 
కొత్త వేరియంట్లు దాడి చేస్తున్న త‌రుణంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ చాలా కీల‌క‌మైంద‌న్నారు. బ్రిట‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు మూడ‌వ వంత జ‌నాభాకు వ్యాక్సిన్లు ఇచ్చారు. వీలైనంత వ‌ర‌కు ఫ‌స్ట్ డోసును ఇచ్చేశారు. ఇక రెండ‌వ డోసు కోసం మాత్రం 12 వారాల‌ గ‌డువును విధించారు. వ్యాక్సిన్ల మ‌ధ్య గ‌డువును పెంచ‌డం వ‌ల్ల‌.. శ‌రీరంలో వైర‌స్‌కు వ్య‌తిరేకంగా ఉత్ప‌త్తి అయ్యే యాంటీబాడీలు 20 నుంచి 300 శాతం వ‌ర‌కు పెరిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తాజా స‌ర్వే అభిప్రాయ‌ప‌డింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments