దేశంలో కొత్తగా మరో 8 వేల కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2022 (10:18 IST)
దేశంలో కొత్తగా మరో ఎనిమిది వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన ప్రకటనలో గడిచిన 24 గంటల్లో 8,586 మందికి ఈ వైరస్ సోకినట్టు వెల్లడించింది. మరో 48 మంది కరోనా బాధితులు చనిపోయారు. గత 24 గంటల్లో 9,650 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. 
 
కొత్త కేసులతో కలుపుకుంటే మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,43,57,546కు చేరగా, ఇందులో 4,37,33,624 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ కారణంగా ఇప్పటివరకు 5,27,416 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 210.31 కోట్ల మందికి ఈ టీకాలను పంపిణీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనిరుధ్ రవిచంద్రన్, కావ్య మారన్‌ల పెళ్లికి ముహూర్తం ఖరారు?

కావ్యా మారన్‌ను అనిరుధ్ పెళ్లాడనున్నారా?

శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో 'ఈఠ' టైటిల్ వివాదం ఏంటి?

నా భర్త గోవిందాకు అనేక మంది మహిళలతో సంబంధం ఉంది : భార్య సునీత అహుజా

నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బాహుబలి ది టార్చ్ బేరర్

తర్వాతి కథనం
Show comments