Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా రోగి ఆస్పత్రికి... దొంగలు ఆ ఇంట్లో చొరబడి చపాతీలు, మటన్ లాగించి....?

Webdunia
ఆదివారం, 19 జులై 2020 (17:41 IST)
Mutton Chappathi
కరోనా కేసులు అధికంగా వున్న ప్రాంతాలను కంటైన్మైంట్ జోన్‌గా ప్రభుత్వాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతాలు నిర్మానుష్యంగా వుండటం.. ప్రజలు అధికంగా సంచరించకపోవడం వంటివి అకృత్యాలకు పాల్పడేవారికి బాగా కలిసొచ్చేలా చేసింది. ఇలాంటి ప్రదేశాల్లో దొంగలు బాగా దోచేసుకుంటున్నారు. జార్ఖండ్‌లో ఇలా ఇళ్లల్లో పడి దోచుకునే నేరాలు పెరిగిపోతున్నాయి. 
 
వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ఓ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు అధికారులు. అక్కడ కరోనా సోకిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించడంతో.. అతడి భార్య, పిల్లల్ని తీసుకుని స్వగ్రామానికి వెళ్లిపోయింది. ఇక, అధికారులు ఆ ఇంటిని సీజ్ చేశారు. 
 
నెల రోజులుగా ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు. అదే అదునుగా భావించిన దొంగలు.. ప్లాన్ చేసుకుని ఆ ఇంట్లోకి చొరబడ్డారు.. అది కంటైన్మెంట్ జోన్ కూడా కావడంతో దొంగలు రెచ్చిపోయారు. ఆ ఇంట్లో రాత్రి మటన్ కర్రీ, చపాతీలు.. ఇలా వంట చేసి విందు చేసుకున్నారు.
 
ఆ తర్వాత ఇంట్లో ఉన్న రూ.50 వేలు, దొరికినకాడికి నగలు దోచుకుని పారిపోయారు. కానీ ఆ ఇంటిని చూసొద్దామని కరోనా రోగి సోదరుడు వెళ్తే.. అతడు ఖంగుతిన్నాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments