Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా రోగి ఆస్పత్రికి... దొంగలు ఆ ఇంట్లో చొరబడి చపాతీలు, మటన్ లాగించి....?

Webdunia
ఆదివారం, 19 జులై 2020 (17:41 IST)
Mutton Chappathi
కరోనా కేసులు అధికంగా వున్న ప్రాంతాలను కంటైన్మైంట్ జోన్‌గా ప్రభుత్వాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతాలు నిర్మానుష్యంగా వుండటం.. ప్రజలు అధికంగా సంచరించకపోవడం వంటివి అకృత్యాలకు పాల్పడేవారికి బాగా కలిసొచ్చేలా చేసింది. ఇలాంటి ప్రదేశాల్లో దొంగలు బాగా దోచేసుకుంటున్నారు. జార్ఖండ్‌లో ఇలా ఇళ్లల్లో పడి దోచుకునే నేరాలు పెరిగిపోతున్నాయి. 
 
వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ఓ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు అధికారులు. అక్కడ కరోనా సోకిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించడంతో.. అతడి భార్య, పిల్లల్ని తీసుకుని స్వగ్రామానికి వెళ్లిపోయింది. ఇక, అధికారులు ఆ ఇంటిని సీజ్ చేశారు. 
 
నెల రోజులుగా ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు. అదే అదునుగా భావించిన దొంగలు.. ప్లాన్ చేసుకుని ఆ ఇంట్లోకి చొరబడ్డారు.. అది కంటైన్మెంట్ జోన్ కూడా కావడంతో దొంగలు రెచ్చిపోయారు. ఆ ఇంట్లో రాత్రి మటన్ కర్రీ, చపాతీలు.. ఇలా వంట చేసి విందు చేసుకున్నారు.
 
ఆ తర్వాత ఇంట్లో ఉన్న రూ.50 వేలు, దొరికినకాడికి నగలు దోచుకుని పారిపోయారు. కానీ ఆ ఇంటిని చూసొద్దామని కరోనా రోగి సోదరుడు వెళ్తే.. అతడు ఖంగుతిన్నాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments