కరోనా ఎఫెక్టు : పరీక్షా నిబంధనల్లో మార్పులు - ఇంజనీర్ కోసం గాలింపు

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (10:47 IST)
తెలుగు రాష్ట్రాలను కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. రోజురోజుకూ కరోనా వైరస్ అనుమానితుల సంఖ్య పెరుగుతోంది. ఇదేసమయంలో ఇంటర్ పరీక్షలు ప్రారంభంకావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణా నిబంధనల్లో మార్పులు చేసింది. 
 
ఈ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మాస్కులను ధరించి పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇదేసమయంలో వారు తమ సొంత వాటర్ బాటిల్‌ను పరీక్షా హాల్‌లోకి తీసుకెళ్లేందుకు కూడా అనుమతినిస్తున్నట్టు తెలిపారు.
 
ముఖ్యంగా, జ్వరం, దగ్గ, జలుబుతో బాధపడుతున్న విద్యార్థులను విడిగా మరో గదిలో కూర్చోబెట్టి పరీక్షలు రాయిస్తామని, దీనిపై అక్కడి ఇన్‌చార్జ్, ఇన్విజిలేటర్లు సొంతంగా నిర్ణయం తీసుకుంటారని ఉన్నత విద్యామండలి అధికారి ఒకరు తెలియజేశారు. 
 
ఇదిలావుండగా, తెలంగాణలో కరోనా అనుమానితుల సంఖ్య 550కి చేరువైంది. బుధవారం ఒక్కరోజులో 90 మంది బాధితులు గాంధీ ఆసుపత్రిని ఆశ్రయించగా, వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. 
 
ఇదిలావుంటే, చైనా నుంచి వచ్చిన చిత్తూరు జిల్లావాసి కోసం అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. జిల్లాలోని ఎర్రావారిపాలెం, నెరబైలుకు చెందిన కుండ్ల గిరిధర్ చైనాలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. గత నెల 25న చైనా నుంచి స్వదేశానికి ఆయన తిరిగొచ్చాడు.
 
బెంగళూరు విమానాశ్రయంలో దిగిన తర్వాత నుంచి ఆయన కనిపించకుండా పోయాడు. కరోనా వైరస్ కలకలం నేపథ్యంలో ఆయన కనిపించకుండా పోవడం సంచలనమైంది. విషయం తెలిసిన వైద్యాధికారులు ఆయన కోసం గ్రామానికి వెళ్లి ఆరా తీసినట్టు తెలిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Pallavi: కల్కి-2లో దీపికా పదుకొణె స్థానంలో సాయి పల్లవి?

పెద్దలు అంగీకరించకుంటే పారిపోయి పెళ్లి చేసుకునేవాళ్లం : కీర్తి సురేశ్

Vijay Rashmika : విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం.. ఫిబ్రవరి 26న సీక్రెట్ మ్యారేజ్?

Shruti Haasan: ఆకాశంలో ఒక తార లో సిగరెట్‌ తాగుతూ రఫ్‌ గా వుండే పాత్రలో శృతి హాసన్‌

Lakshmi Rai: లక్ష్మీ రాయ్ జనతా బార్.. త్వరలోనే హిందీ లో విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రియాంక మోహన్‌తో కలిసి హైదరాబాద్‌లో ఒకే రోజు 4 కొత్త స్టోర్‌లను ప్రారంభించిన కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ

వంట్లో వేడి చేసినట్టుంది, ఉప్మా తినాలా? పూరీలు తినాలా?

సంగారెడ్డిలో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌ను మరింత విస్తరించటానికి చేతులు కలిపిన గ్రాన్యూల్స్ ఇండియా, సెర్ప్

వామ్మో Nipah Virus, 100 మంది క్వారెంటైన్, లక్షణాలు ఏమిటి?

పీతలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments