తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి.. ఏపీలో 1288, తెలంగాణలో 956 కేసులు

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (20:28 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 1,288 కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో 9,04,548కి కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో ఐదుగురు మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 7,225 మరణాలు సంభవించాయి. ఏపీలో ప్రస్తుతం 8,815 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనాతో 8,88,508 మంది రికవరీ అయ్యారు.
 
శుక్రవారంతో రాష్ట్రవ్యాప్తంగా 1,51,46,104 సాంపిల్స్‌ను పరీక్షించారు. గురువారం జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 26, చిత్తూరు 225, తూర్పుగోదావరి 26, గుంటూరు 311, కడప 21, కృష్ణా 164, కర్నూలు 52, నెల్లూరు 118, ప్రకాశం 62, శ్రీకాకుళం 54, విశాఖపట్నం 191, విజయనగరం 31, పశ్చిమ గోదావరి 7 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
 
మరోవైపు తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 965 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఐదుగురు మృతి చెందారు. అలాగే 9159 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీలో 254, మేడ్చల్‌లో 110, రంగారెడ్డిలో 97, నిజామాబాద్‌లో 64, నిర్మల్‌లో 39, జగిత్యాల్‌లో 35 కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో కేసులు నమోదు అవుతున్నాయి. కేసులు పెరుగుతున్న తరుణంలో వైద్యశాఖ అప్రమత్తమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శంబాల లో నాకు అద్భుతమైన పాత్ర దక్కింది, నటుడిగా గుర్తింపునిచ్చింది : శివకార్తిక్

మర్దానీ 3 ట్రైలర్ నన్ను కదిలించిందన్న హర్మన్‌ ప్రీత్ కౌర్

మగాడిపై సానుభూతి కలిగించేలా పురుష: నుంచి కీరవాణి పాట

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న చిత్రం వీడీ 14 టైటిల్ ప్రకటన

స్వయంభు కోసం టాప్ విఎఫ్ఎక్స్ కంపెనీలు ముందుకు వచ్చాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments