Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి.. ఏపీలో 1288, తెలంగాణలో 956 కేసులు

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (20:28 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 1,288 కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో 9,04,548కి కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో ఐదుగురు మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 7,225 మరణాలు సంభవించాయి. ఏపీలో ప్రస్తుతం 8,815 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనాతో 8,88,508 మంది రికవరీ అయ్యారు.
 
శుక్రవారంతో రాష్ట్రవ్యాప్తంగా 1,51,46,104 సాంపిల్స్‌ను పరీక్షించారు. గురువారం జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 26, చిత్తూరు 225, తూర్పుగోదావరి 26, గుంటూరు 311, కడప 21, కృష్ణా 164, కర్నూలు 52, నెల్లూరు 118, ప్రకాశం 62, శ్రీకాకుళం 54, విశాఖపట్నం 191, విజయనగరం 31, పశ్చిమ గోదావరి 7 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
 
మరోవైపు తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 965 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఐదుగురు మృతి చెందారు. అలాగే 9159 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీలో 254, మేడ్చల్‌లో 110, రంగారెడ్డిలో 97, నిజామాబాద్‌లో 64, నిర్మల్‌లో 39, జగిత్యాల్‌లో 35 కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో కేసులు నమోదు అవుతున్నాయి. కేసులు పెరుగుతున్న తరుణంలో వైద్యశాఖ అప్రమత్తమైంది.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments