Webdunia - Bharat's app for daily news and videos

Install App

తైవాన్ మాత్రం ఆ విషయంలో గ్రేట్..

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (17:14 IST)
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో తైవాన్ మాత్రం ఈ విషయంలో మిగతా దేశాల కంటే మెరుగైన స్థితిలో ఉంది. గత 200 రోజులుగా అక్కడ స్థానికంగా ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదు కాలేదు. ఫలితంగా ఇన్ని రోజులపాటు కేసు నమోదు కాని ఏకైక దేశంగా రికార్డులకెక్కింది.

తైవాన్‌లో చివరిసారి ఏప్రిల్ 12న కేసు నమోదైంది. 23 మిలియన్ల మంది కలిగిన తైవాన్‌లో ఇప్పటి వరకు 553 కేసులు మాత్రమే నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి ఏడుగురు మృత్యువాత పడ్డారు.
 
కరోనాపై పోరులో అందరికంటే ముందే సరిహద్దులు మూసివేయడం, ప్రయాణ ఆంక్షలు విధించడం కారణంగా అక్కడ కరోనా వైరస్ అంతగా ప్రభావం చూపలేకపోయిందని నిపుణులు చెబుతున్నారు.

అలాగే, ప్రజలందరూ మాస్కులు ధరించడం, కాంటాక్ట్ ట్రేసింగ్ వంటివి కూడా వైరస్‌కు అడ్డుకట్ట వేశాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ను అడ్డుకున్న ఏకైక దేశం తైవానేనని వైద్యులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments