దేశంలో 101కు చేరిన ఒమిక్రాన్ కేసులు - ఢిల్లీలోనే 10

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (17:40 IST)
దేశంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కేంద్రవైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ప్రకటించిన వివరాల మేరకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 101 ఒమిక్రాన్ పాజటివ్ కేసులు నమోదయ్యాయి. అందువల్ల అనవసర ప్రయాణాలు తక్షణం ఆపేయాలని ఆయన కోరారు. అలాగే, సామూహిక సమావేశాలు రద్దు చేసుకోవాలని సూచించారు. పండుగలను తక్కువ స్థాయిలో సెలబ్రేట్ చేసుకోవాలని ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ బల్‌రామ్ భారగ్ తెలిపారు. 
 
అంతేకాకుండా యూరప్ దేశాల్లో భారీ స్థాయిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయనీ, అందువల్ల అక్కడ కొత్త దశ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పౌల్ తెలిపారు. ప్రతి శాంపిల్‌న జీనోమ్ సీక్వెన్సింగ్ సాధ్యంకాదని, అయితే వ్యూహాత్మక రీతిలో శాంపిల్స్‌ను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు ఒమిక్రాన్ వైరస్‌‍ను 91 దేశాల్లో గుర్తించినట్టు లవ్ అగర్వాల్ వెల్లడించారు. 
 
ఇదిలావుంటే, దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 10 కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా, గురువారం ఏకంగా 85 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. అలాగే, ఈ నెల 5వ తేదీన ఒమిక్రాన్ తొలి కేసు వెలుగు చూడగా, ఇప్పటికీ ఈ కేసుల సంఖ్య పదికి చేరింది. విదేశాల నుంచి ఢిల్లీకి వచ్చిన వారిలోనే ఈ వైరస్‌ను అధికంగా గుర్తించినట్టు ఆరోగ్య మంత్ర సత్యేందర్ జైన్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments