ధారావిలో కరోనా కేసులు నిల్.. జనవరిలో రెండోసారి జీరో కేసులు

Webdunia
బుధవారం, 27 జనవరి 2021 (21:11 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలోని అతిపెద్ద మురికివాడ అయిన ధారావిలో గత 24గంటల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదని అధికారులు బుధవారం తెలిపారు. జీరో కేసులు జనవరిలో రెండోసారి అని, నగరంలో కరోనా వ్యాప్తి చెందిన అనంతరం మూడోసారి అని అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 22న ఎలాంటి వైరస్ కేసులు నిర్ధారణ కాలేవు. గతేడాది డిసెంబర్‌ 25న కూడా ఒక్క కేసు సైతం నమోదు కాలేదు. 
 
ప్రస్తుతం ధారావిలో కేస్‌లోడ్‌ 3,911 కు చేరగా.. ఇప్పటి వరకు 3585 మంది కోలుకొని దవాఖానాల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 14 క్రియాశీల కేసులు మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఈ మురికివాడలో తొలి కరోనా కేసు గత ఏడాది ఏప్రిల్ 1న నమోదైంది. 
 
ముంబైలో ఫస్ట్‌ కొవిడ్‌ కేసును గుర్తించిన దాదాపు 20 రోజుల తర్వాత ఇక్కడ ఓ వ్యక్తి వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించాడు. 2.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ధారావిలో 6.5లక్షలకుపైగా జనాభా ఉండగా.. ఆసియాలోనే అతిపెద్ద మురికవాడగా నిలిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యాలకు, వారణాసి టైటిల్ పై రాజమౌళి కు చెక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments