కరోనా సోకి మృతి చెందితే ఇంటికి చెప్పకుండా అంత్యక్రియలు చేశారు..?

Webdunia
శనివారం, 15 ఆగస్టు 2020 (12:09 IST)
కరోనా వైరస్‌తో మృతి చెందిన వారి పరిస్థితి చాలా దయనీయంగా మారింది. కరోనా సోకిన వారి మృతదేహాలను మార్చి ఇచ్చేయడం వంటి ఘటనలు వినే వున్నాం. ఇంకా కొన్నిచోట్ల వైద్యులు సహా మున్సిపల్ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరంగా వుంది. కరోనాతో చావు మున్సిపాలిటీ వాళ్ళు కుక్కలా కన్నా హీనంగా చూసే పరిస్థితి ఉంటుంది. ఎన్ని హెచ్చరికలు చేసినా సరే సిబ్బందిలో మార్పులు రావడం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది.
 
ఎంజీఎంలో మరోసారి అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. కరోనాతో చనిపోయిన మహిళను బంధువులకు సమాచారం ఇవ్వకుండానే అంత్యక్రియలు చేశారు అధికారులు. తమ తల్లి చనిపోయిందని తెలుసుకుని మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వెళితే లేదని చెప్పారు అధికారులు. 
 
మృతదేహాన్ని ఎక్కడా అంత్యక్రియలు చేశారో చెప్పలేదు. దీనితో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. హన్మకొండ గోపాలపూర్‌కు చెందిన మహిళా ఈ నెల 13న ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments