కర్నూలు: వధువుకు కరోనా పాజిటివ్... ఆగిన పెళ్లి

Webdunia
ఆదివారం, 26 జులై 2020 (12:43 IST)
కరోనా విజృంభిస్తోంది. ఈ కరోనా కారణంగా వివాహాలు వాయిదా పడుతున్నాయి. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో చోటు జరిగింది. పెళ్లి తంతులో భాగంగా గురువారం పెండ్లి కుమారుడిని చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇంతలో అతడికి కరోనా పాజిటివ్‌ అంటూ రిపోర్టు వచ్చింది. దీంతో పెళ్లిని వాయిదా వేశారు. 
 
తాజాగా ఇలాంటి ఘటనే కర్నూలులో చోటుచేసుకుంది. పెళ్లికూతురికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో పెళ్లి వాయిదా పడింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణం చెంచు కాలనీకి చెందిన ఓ యువతికి వివాహం నిశ్చమైంది.
 
ఈ నెల 25న పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కోవిడ్‌ నిబంధనల ప్రకారం వివాహానికి మూడు రోజుల ముందు వధూవరులు ఇద్దరు కోవిడ్‌ పరీక్షలు చేయించుకున్నారు. శనివారం పెళ్లి జరగాల్సి ఉండగా.. ఉదయం పెళ్లి కూతురికి కరోనా పాజిటివ్‌ అని రిపోర్టులు వచ్చాయి. దీంతో అధికారులు హుటాహుటీన ఆ యువతి ఇంటికి చేరుకుని విషయం చెప్పారు. 
 
దీంతో ఇరు కుటుంబాలు చర్చించుకుని చేసేది లేక వివాహాన్ని వాయిదా వేశాయి. ఇక నందికొట్కూరులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. 22న కోట హైస్కూల్‌ వద్ద 378 మంది పరీక్షలు చేస్తే.. 100 మందికి వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: సింగ్ గీతం కథ 30ఏళ్ళనాడు కీరవాణి ద్వారా విన్నా : ఎస్.ఎస్. రాజమౌళి

Balakrishna: బాలకృష్ణ పుట్టినరోజున NBK111 టీజర్‌ చూస్తూ ఆనందించిన కుటుంబసభ్యులు

'మీరే నా సర్వస్వం..' - భారతీరాజా మృతిపై నటి రాధిక ఎమోషనల్ పోస్ట్

లక్షలకు లక్షలు పారితోషికం తీసుకున్న వరలక్ష్మి ప్రమోషన్‌కు డుమ్మా కొట్టారు.. (Video)

కర్మ ఎవరినీ వదలదు—వరలక్ష్మిని కూడా : దర్శకుడు సంజీవ్ మెగోటి

తర్వాతి కథనం
Show comments