Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర కరోనా ఉధృతి : రెండోసారి వైరస్ బారినపడిన మంత్రి

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (09:46 IST)
మహారాష్ట్రలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో రోజుకు దాదాపు 25 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్రానికి చెందిన మంత్రి ఒకరు రెండోసారి ఈ వైరస్‌ కోరల్లో చిక్కారు. దీంతో ఆయన దవాఖానలో చేరారు. ఈ మధ్యకాలంలో తనను కలిసినవారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. 
 
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో సామాజిక న్యాయం, స్పెషల్‌ అసిస్టెన్స్‌ శాఖ మంత్రిగా ధనుంజయ్‌ ముండే పనిచేస్తున్నారు. ఎన్సీపికి చెందిన ఈయనకు గతేడాది జూన్‌ నెలలో కరోనా వైరస్ సోకింది. మరోసారి తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని ఆయన ట్విటర్‌ ద్వారా మంగళవారం అర్థరాత్రి ప్రకటించారు.
 
"నాకు ఈరోజు రెండోసారి కరోనా పాజిటివ్‌ వచ్చింది. గత కొన్నిరోజులుగా తనను కలిసిన ప్రతిఒక్కరు పరీక్షలు చేయించుకోవాలి. తనగురించి భయపడాల్సింది ఏమీలేదు. ప్రతిఒక్కరు విధిగా మాస్కులు ధరించాలి, భౌతిక దూరం పాటించడంతోపాటు జాగ్రత్తగా ఉండాలి" అని మరాఠీలో ట్వీట్‌ చేశారు.
 
ఇదిలావుంటే, మహారాష్ట్రలో మంగళవారం ఒక్కరోజే 28,699 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 25,33,026కు చేరాయి. ఇందులో 22,47,495 మంది బాధితులు వైరస్‌ బారినుంచి కోలుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వంత్ నటించిన సస్పెన్స్ చిత్రం హైడ్ న్ సిక్ ఎలా వుందంటే.. మూవీ రివ్యూ

'దేవర' చిత్రానికి బిజినెస్ జరగలేదా? ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశ!

మ్యాడ్ స్క్వేర్ నుంచి లడ్డు గాని పెళ్లి గీతం విడుదల

అక్కినేని నాగేశ్వరరావు ప్రయాణం ప్రతి ఒక్కరికి ప్రేరణ : నందమూరి బాలకృష్ణ

ఏయన్నార్ కృషి - కీర్తి - స్పూర్తి ప్రతి నటునికి మార్గదర్శకం : బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments