Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతా కొత్త కరోనా తలనొప్పి-మహారాష్ట్రలో జనవరి 31 వరకు లాక్ డౌన్..

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (14:06 IST)
దేశంలో కరోనా వైరస్ కొత్త రకం వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మరో నెలరోజులపాటు పొడిగించింది. జవవరి 31 వరకు లాక్‌డౌన్‌ నిబంధనలు అమలులో ఉంటాయని ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే మున్సిపాలిటీల్లో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నది. వచ్చేనెల జనవరి 5 వరకు పట్టణ ప్రాంతాల్లో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉండనుంది.
 
కాగా, పుణేలో ఇప్పటికే ఒకరికి కరోనా కొత్త వైరస్‌ సోకింది. మొత్తం 50 మంది నమూనాలను పరీక్షించగా ఒకరికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో వారి కుటుంబ సభ్యులను ఐసోలేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో యూకే నుంచి వస్తున్న వారిపై అధికారులు నిఘా పెంచారు.
 
దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,25,066 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 49,373మంది మరణించగా, 55,672 మంది చికిత్స పొందుతున్నారు. దేశంలోని ఐదు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 60 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అందులో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

హరిహర వీరమల్లు లో అసరుల హననం సాంగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

Manisharma: మణిశర్మ ఆవిష్కరించిన వసుదేవ సుతం గ్లింప్స్

పెళ్లి పీటలెక్కనున్న విశాల్.. వధువు ఎవరంటే?

ఏస్ చిత్రంలో జూదం అనేది ఉప్పెనలాంటిదంటున్న విజయ్ సేతుపతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments