కర్నూలు వైద్య కాలేజీలో కరోనా కలకలం - 15 మందికి పాజిటివ్

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (11:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉన్న వైద్య కాలేజీలో కరోనా వైరస్ కలకలం రేగింది. ఈ కాలేజీలోని అనేక మంది విద్యార్థులకు ఈ వైరస్ సోకింది. ఇప్పటివరకు 50 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 15 మందికి ఈ పాజిటివ్ ఫలితం వచ్చింది.
 
ఇందులో 11 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం చదువుతుంటే, నలుగురు హౌస్ సర్జన్ విద్యార్థులు. అలాగే, మరో 40 మంది విద్యార్థుల నుంచి శాంపిల్స్ సేకరించి పరిశోధనాశాలకు పంపించారు. వైద్య కాలేజీలో చదువుకునే విద్యార్థులకు ఈ వైరస్ సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పాజిటివ్‌గా వచ్చిన విద్యార్థులను ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 
 
అలాగే, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కరోనా కలకలం సృష్టించింది. ఈ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సీఐ, ఎస్ఐలతో పాటు.. 9 మందికి ఈ వైరస్ సోకింది. దీంతో వారిని ఐసోలేషన్‌కు తరలించారు. అలాగే, ఈ స్టేషన్‌లోని మిగిలినవారికి కూడా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments