Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు వైద్య కాలేజీలో కరోనా కలకలం - 15 మందికి పాజిటివ్

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (11:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉన్న వైద్య కాలేజీలో కరోనా వైరస్ కలకలం రేగింది. ఈ కాలేజీలోని అనేక మంది విద్యార్థులకు ఈ వైరస్ సోకింది. ఇప్పటివరకు 50 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 15 మందికి ఈ పాజిటివ్ ఫలితం వచ్చింది.
 
ఇందులో 11 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం చదువుతుంటే, నలుగురు హౌస్ సర్జన్ విద్యార్థులు. అలాగే, మరో 40 మంది విద్యార్థుల నుంచి శాంపిల్స్ సేకరించి పరిశోధనాశాలకు పంపించారు. వైద్య కాలేజీలో చదువుకునే విద్యార్థులకు ఈ వైరస్ సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పాజిటివ్‌గా వచ్చిన విద్యార్థులను ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 
 
అలాగే, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కరోనా కలకలం సృష్టించింది. ఈ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సీఐ, ఎస్ఐలతో పాటు.. 9 మందికి ఈ వైరస్ సోకింది. దీంతో వారిని ఐసోలేషన్‌కు తరలించారు. అలాగే, ఈ స్టేషన్‌లోని మిగిలినవారికి కూడా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments