గణనీయంగా తగ్గిన కోవిడ్ యాక్టివ్ కేసులు...

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2022 (11:05 IST)
దేశంలో రోజువారీగా నమోదయ్యే కరోనా వైరస్ పా
జిటివ్ కేసుల సంఖ్యతో పాటు.. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా క్రియాశీలక కేసుల సంఖ్య 50 వేలకు దిగువకు చేరుకున్నాయి.
 
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3.21 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 5,379 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. ముందురోజు కంటే వెయ్యి కేసులు అదనంగా వచ్చాయి. పాజిటివిటీ రేటు 1.67 శాతానికి చేరింది.
 
అలాగే, ఈ వైరస్ నుంచి మంగళవారం 7,094 మంది కోలుకున్నారు. కేరళలో 11 మరణాలు నమోదు కాగా.. దేశవ్యాప్తంగా మొత్తం 27 మంది మృతి చెందారు. క్రియాశీల కేసులు 50 వేలకు తగ్గాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 50,594(0.11 శాతం)కి చేరింది. 
 
ఈ రెండేళ్ల కాలంలో 4.44 కోట్ల మందికి కరోనా సోకగా.. అందులో 98.70 శాతం మంది వైరస్‌ను జయించారు. ఇక ఇప్పటివరకూ 213 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి. మంగళవారం 18.8 లక్షల మంది టీకా తీసుకున్నారని బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments