Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ వ్యాప్తంగా 87 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లు

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (12:06 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం కరోనా వ్యాక్సిన్ ముమ్మరంగా సాగుతోంది. ఈ వ్యాక్సిన్ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటివరకు 87,20,822 మందికి కరోనా టీకాలు వేశారు. ఈ డ్రైవ్ ముగిసిన తర్వాత వృద్ధులకు టీకాల పంపిణీ చేపట్టనున్నారు. 
 
మరోవైపు, దేశంలో మరో 9121 కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం గత 24 గంటల్లో 9,121 మందికి కరోనా వైరస్ సోకింది. అదేస‌మ‌యంలో 11,805 మంది కోలుకోగా, మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,25,710 కు చేరింది.
 
ఇకపోతే, గడచిన 24 గంట‌ల సమయంలో 81 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,55,813కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,06,33,025 మంది కోలుకున్నారు. 1,36,872 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. 
 
అదేవిధంగా దేశంలో కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ కూడా కొనసాగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 87,20,822 మందికి వ్యాక్సిన్ వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 20,73,32,298 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 6,15,664 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments