Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ వ్యాప్తంగా 87 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లు

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (12:06 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం కరోనా వ్యాక్సిన్ ముమ్మరంగా సాగుతోంది. ఈ వ్యాక్సిన్ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటివరకు 87,20,822 మందికి కరోనా టీకాలు వేశారు. ఈ డ్రైవ్ ముగిసిన తర్వాత వృద్ధులకు టీకాల పంపిణీ చేపట్టనున్నారు. 
 
మరోవైపు, దేశంలో మరో 9121 కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం గత 24 గంటల్లో 9,121 మందికి కరోనా వైరస్ సోకింది. అదేస‌మ‌యంలో 11,805 మంది కోలుకోగా, మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,25,710 కు చేరింది.
 
ఇకపోతే, గడచిన 24 గంట‌ల సమయంలో 81 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,55,813కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,06,33,025 మంది కోలుకున్నారు. 1,36,872 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. 
 
అదేవిధంగా దేశంలో కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ కూడా కొనసాగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 87,20,822 మందికి వ్యాక్సిన్ వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 20,73,32,298 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 6,15,664 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments