Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (10:33 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. గత వారం రోజులుగా ఈ కేసుల్లో పెరుగుదల కనిపించగా, తాజాగా తగ్గాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,594 కేసులు మాత్రమే నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
నిజానికి గత మూడు రోజులుగా 8 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ వచ్చాయి. దీంతో అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేయడంతో ఆయా రాష్ట్రాలు కరోనా వైరస్ వ్యాప్తికి చర్యలు చేపట్టారు. దీంతో 24 గంటల్లో నమోదైన ఈ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించింది. అంటే సోమవారంతో పోల్చుకుంటే ఈ కేసుల సంఖ్య 18 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. 
 
తాజా కేసులతో కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 4,32,36,695కు చేరింది. ఇందులో 4,26,61,370 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరో 50,548 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,24,771 మంది కరోనాతో మృతిచెందారు. కాగా, గడిచిన 24 గంటల్లో 4035 మంది కోలుకున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments