దేశంలో తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (10:33 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. గత వారం రోజులుగా ఈ కేసుల్లో పెరుగుదల కనిపించగా, తాజాగా తగ్గాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,594 కేసులు మాత్రమే నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
నిజానికి గత మూడు రోజులుగా 8 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ వచ్చాయి. దీంతో అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేయడంతో ఆయా రాష్ట్రాలు కరోనా వైరస్ వ్యాప్తికి చర్యలు చేపట్టారు. దీంతో 24 గంటల్లో నమోదైన ఈ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించింది. అంటే సోమవారంతో పోల్చుకుంటే ఈ కేసుల సంఖ్య 18 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. 
 
తాజా కేసులతో కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 4,32,36,695కు చేరింది. ఇందులో 4,26,61,370 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరో 50,548 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,24,771 మంది కరోనాతో మృతిచెందారు. కాగా, గడిచిన 24 గంటల్లో 4035 మంది కోలుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వంద కోట్ల మార్కులో వరుసగా మూడు చిత్రాలు.. హీరో ప్రదీప్ రంగనాథన్ అదుర్స్

ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ పుకార్లు.. కారణం ఏంటంటే?

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments