దేశంలో కొత్తగా 9,355 కరోనా కేసులు

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2023 (10:45 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. గత రెండు రోజులుగా తగ్గినట్టు కనిపించిన కరోనా కేసులు గురువారం మళ్లీ పది వేలకు చేరుకున్నాయి. బుధవారం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 9355 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 24 మరణాలు సంభవించగా, ఇందులో ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఆరుగురు చనిపోయారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 57410 క్రియాశీలక కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
దేశంలో కరోనా వ్యాప్తిని సూచించే రోజువారీ పాజిటివిటీ రేటు 4.08 శాతంగా ఉన్నట్టు కేంద్రం పేర్కొంది. వారంరోజుల సగటు పాజిటివిటీ రేటు 5.36 శాతమని తెలిపింది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసుల వాటా 0.13 శాతమన్న కేంద్రం, కొవిడ్ రికవరీ రేటు 98.69 శాతంగా ఉందని వెల్లడించింది. ఇక దేశంలో ఇప్పటివరకూ 22.66 కోట్ల కరోనా టీకాలను పంపిణీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐటీ ఉద్యోగాలు వదిలి హీరోయిన్లు అయ్యారు

Peddi: ఆరు రోజుల్లో పెద్ది షూటింగ్ పూర్తి - ఐటెంసాంగ్ లో సంయుక్త మీనన్ !

Nagababu: CASTE మూవీ నుంచి రంగరాజన్ గా నాగబాబు లుక్

బెల్లంకొండ గణేష్, ఎ. కరుణాకరన్ కాంబినేషన్ లో రొమాంటిక్ కామెడీ చిత్రం

Vishwak Sen: థాయ్‌లాండ్‌లో విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ ల ఈఎన్ఈ రిపీట్ షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోల్డెన్ మిల్క్ హెల్త్ సీక్రెట్స్

గుండె సంబంధ వ్యాధులు రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

తాజా పిండి: ఆధునిక వంటగదులకు సాంప్రదాయ పిండి రుబ్బే పద్ధతిని తెస్తున్న సాఫ్టెల్

అక్షయ తృతీయ ప్రచారంతో కృతిశెట్టితో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ప్రకటించిన ఇంద్రియ

హైదరాబాద్‌లో తొలిసారిగా జరిగిన ది లీలా మొజాయిక్ 2026కి విశేష స్పందన

తర్వాతి కథనం
Show comments