Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం.. 24 గంటల్లో 15వేల కేసులు

Webdunia
శనివారం, 16 జనవరి 2021 (10:38 IST)
దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,158 వైరస్‌ కేసులు బయటపడ్డాయి. క్రితం రోజుతో పోలిస్తే 432 కేసులు తక్కువ. శనివారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,05,42,841కి చేరింది. ఇక గత 24 గంటల్లో మరో 16,977 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు వైరస్‌ నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,01,79,715కి పెరిగింది. రికవరీ రేటు 96.56శాతంగా ఉంది.
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,11,033 కరోనా క్రియాశీల కేసులుండగా.. క్రియాశీల రేటు 2శాతానికి తగ్గింది. మరోవైపు వైరస్‌ కారణంగా నిన్న మరో 175 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు మొత్తంగా 1,52,093 మంది కరోనాకు బలయ్యారు. శుక్రవారం 8,03,090 కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 18,57,65,491 మందికి టెస్టులు చేశారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments