Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మరో 11502 కరోనా కేసులు... మరణాల్లో 9వ స్థానం

Webdunia
సోమవారం, 15 జూన్ 2020 (11:33 IST)
దేశంలో కొవిడ్‌-19‌ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. సోమవారం కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 11,502 మందికి కొత్తగా కరోనా సోకింది. అదేసమయంలో 325 మంది మరణించారు.
 
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 3,32,424 చేరగా, మృతుల సంఖ్య మొత్తం 9,520కి పెరిగింది. 1,53,106 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,69,798 మంది కోలుకున్నారు. 
 
మరోవైపు, దేశంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీంతో కరోనా మరణాల్లో 9వ స్థానానికి చేరుకుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 3,32,424 కేసులు నమోదు కాగా... 9520 మంది కరోనా బారిన పడి మృత్యువాతపడ్డారు. 
 
అలాగే దేశవ్యాప్తంగా 1,53,106 మంది ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకుని 1,69,798 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. 
 
గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 11,502 కేసులు నమోదు కాగా... 325 మంది మృతి చెందారు. దేశంలో కరోనా రికవరీ రేటు 51 శాతానికి చేరింది. మరోవైపు మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. లక్షకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. 
 
మహారాష్ట్రలో అత్యధికంగా 1,07,958 కేసులు నమోదు కాగా...3950 మంది మృతి చెందారు. అలాగే తమిళనాడులో 44,661 కేసులు నమోదు అవగా 435 మంది మృతి చెందారు. 
 
ఢిల్లీలో 41,182 కేసులు నమోదు కాగా...1327 మంది మృతి చెందారు. అలాగే గుజరాత్‌లో 23,544 కేసులు నమోదు అవగా 1477 మంది మృత్యువాతపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వర్జిన్ బాయ్స్: యూత్ ని ఫిదా చేస్తున్న పెదవుల తడి సాంగ్ !

దేశం కోసం తపన ఆపరేషన్ సింధూర్ సాంగ్ లో కనిపించింది : జెడి లక్ష్మీనారాయణ

త్రివిక్రమ్ - చెర్రీ కాంబినేషన్‌లో మూవీ?

నాకే ఎందుకు స్వామీ ఈ పరీక్ష : శివయ్యను ప్రశ్నిస్తూ మంచు విష్ణు

పెద్ద మనసుతో ఈ ధరిత్రిని - ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

తర్వాతి కథనం
Show comments