వాడిన బ్రష్‌నే మళ్లీ వాడకూడదట.. టూత్ బ్రష్‌లో 72 గంటల పాటు కరోనా..?

Webdunia
మంగళవారం, 18 మే 2021 (19:36 IST)
Brush
కరోనా బారిన పడిన వారు కరోనా సమయంలో వాడిన బ్రష్ మళ్లీ వాడితే మరోసారి కరోనా బారినపడే అవకాశం ఉందని పరిశోధనల్లో తేలింది. బ్రెజిల్‌ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ నేపథ్యంలో టూత్‌ బ్రష్‌ల వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తలను దంత వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
 
మొదటి సారి కరోనా సోకిన సమయంలో వాడిన బ్రష్ ను పడేయకుండా వాడటం వలన కొందరు రెండవసారి కరోనా బారినపడినట్లు అధ్యయనాల్లో తేలింది. టూత్ బ్రష్‌లో 72 గంటల పాటు కరోనా సజీవంగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు.
 
కరోనా సోకిన వ్యక్తి 14 రోజుల తర్వాత తన పాత బ్రష్ ను పక్కకు పడేసి కొత్త టూత్ బ్రష్ వాడాలని చెబుతున్నారు. అంతే కాదు కరోనా పేషెంట్ వాడే వస్తువుల పక్కన ఇతరుల వస్తువులు పెడితే వారికి కూడా కరోనా వచ్చే అవకాశం ఉందని తేల్చారు. 
 
వాష్‌రూమ్‌ల్లో ఇతర కుటుంబ సభ్యుల టూత్‌ బ్రష్‌లు, టంగ్‌క్లీనర్లు, టూత్‌ పేస్ట్‌లతో పాటు ఇతర టాయిలెట్‌ వస్తువులు/సామగ్రిని ఉంచకూడదని సూచిస్తున్నారు. 
 
కోవిడ్‌ బాధితులు నోటి శుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని. నోటిలో వైరస్‌/బ్యాక్టీరియా నివారణకు గోరు వెచ్చటి ఉప్పునీటిని పుక్కిలించాలని దంతవైద్యులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dr. Kamakshi: ఆ దర్శకుడి కంఫర్ట్ తోనే వరుస సినిమాలు : డాక్టర్ కామాక్షి భాస్కర్ల

ఐటెమ్ సాంగ్ చేయమని ఎవరూ అడగలేదు... మీ ఫ్యామిలీలో ఎవరినైనా చేయమన్నారేమో.... ఖుష్బూ

2 నెలలుగా చదువుకు ఫీజులు చెల్లించడం లేదు : కరిష్మా కపూర్ పిల్లలు

రాజమౌళి ప్రశంసలు తనకు దక్కిన గౌరవం : పృథ్విరాజ్ సుకుమారన్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments