Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనిషి నుంచి కుక్కకు.. కరోనా వైరస్ వ్యాప్తి.. హాంకాంగ్‍లో తొలి కేసు

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (16:34 IST)
ఇప్పటివరకు కరోనా వైరస్ మనుషులకు మాత్రమే సోకుతూ భయభ్రాంతులకు గురిచేస్తూ వచ్చింది. అయితే, ఈ వైరస్ మనుషులు ద్వారా పెంపుడు జంతువులకు కూడా సోకుందని తేలింది. తాజాగా ఓ ఇంట్లోని పెంపుడు శునకానికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆ శునకాన్ని క్వారంటైన్‌కు తరలించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, హాంకాంగ్‌కు చెందిన 60 యేళ్ళ మహిళ ఓ శునకాన్ని పెంచుకుంటూ ఉంది. ఆమె కరోనా వైరస్ బారినపడి కోలుకుంది. అయితే, ఆమె పెంపుడు శునకం కూడా ఈ వైరస్ బారినపడింది. దీన్ని గుర్తించిన స్థానిక అధికారులు ఆ శునకాన్ని జంతువుల క్వారంటైన్‌కు పంపించారు. గత శుక్రవారం నుంచి దానికి క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో దానికి బలహీన స్థాయిలో కరోనా వైరస్ సోకినట్టు తేలింది. 
 
ఈ దెబ్బకు హాంకాంగ్ ప్రభుత్వం పెంపుడు జంతువులకు కూడా ప్రత్యేక క్వారంటైన్ (ఐసోలేష్ వార్డుల తరహాలోనే)ను ఏర్పాటు చేసింది. ఇక్కడ కరోనా వైరస్ పడిన జంతువులకు 14 రోజుల పాటు అక్కడ ఉంచి చికిత్స అందిస్తారు. మనుషుల ద్వారా శునకానికి కరోనా వైరస్ సోకడం ప్రపంచలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments